అవినీతి నిరోధక శాఖ వలకు మరో చేప చిక్కింది. రహదారులు, భవనాల శాఖలో సహాయ ఇంజనీర్ గా పని చేస్తున్న నాగభూషణం ఐదు వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ దొరికిపోయాడు. అనంతపురం నగరం రామ్ నగర్ కు చెందిన సయ్యద్ తాజుల్లా తన భవనాన్ని ఆర్కియాలజీ శాఖకు అద్దేకిస్తున్నాడు. అందుకు గాను అర్ అండ్ బీ అధికారులు అద్దే ను నిర్దారించాల్సి వుంటుంది. దానకి గాను తాజుల్లా సహాయ ఇంజనీర్ నాగబూషణం ను కలిసాడు. అతడి పని పూర్తి చేయడానికి లంచం అడిగాడు. దాంతో తాజుల్లా ఏసీబీకి ఫిర్యాదు చేసాడు. గురువారం లంచం నగదు తీసుకుంటునప్పుడు ఏసీబీ అధాకారులు అతడిని రెడ్ హ్యండెడ్ గా పట్టుకున్నారు.