తిరుపతి
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇసుక విధానాన్ని వ్యతిరేకిస్తూ తిరుపతి ఆర్డీఓ కార్యాలయం వద్ద బీజేపీ శ్రేణులు నిరసన తెలిపాయి.తిరుపతి ఆర్డీవో కార్యాలయ అధికారులకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు తదితర నాయకులు వినతి పత్రాన్ని అందించారు.రాష్ట్రంలో ఉన్న ఇసుకను 760 కోట్ల టెండర్ విధానం ద్వారా ఇవ్వడంతో బంగారం కంటే ఇసుక ధరే ఎక్కువయ్యే పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తుందని బీజేపీ రాష్ట్రఅద్యక్షుడు సోమువీర్రాజు అన్నారు.సామాన్య ప్రజలు ఇసుకని బ్లాక్లో కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని,దీని వల్ల 50 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడే పరిస్థితి ఎదుర్కోవాల్పి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.ఇసుక నూతన విధానంలో ప్రభుత్వానికి అవగాహన లేకపోవడంతో అనేక అక్రమాలు జరిగే అవకాశం ఉందని అన్నారు.