YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

దేశానికి ఆదర్శం కేసీఆర్ పాలన... సంక్షేమానికి చిరునామ తెలంగాణ రాష్ట్రం..

దేశానికి ఆదర్శం కేసీఆర్ పాలన... సంక్షేమానికి చిరునామ తెలంగాణ రాష్ట్రం..

- వృద్దులకు కన్నబిడ్డలాగా... ఒంటరి మహిళలకు పెద్దన్న.. మన మహనేత సిఎం కేసీఆర్ 
- కేసీఆర్ రుణం తీర్చుకునేందుకు లబ్దిదారులంతా సిద్ధంగా ఉన్నారు
- సాగర్ లో టిఆర్ఎస్ పార్టీ విజయం సాధించడం ఖాయం
పెద్దపల్లి  
దేశానికి ఆదర్శవంత పాలన అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్ దని... సంక్షేమానికి చిరునామాగా తెలంగాణ రాష్ట్రాన్ని మార్చి సకల వర్గాలను సుభిక్షంగా ఉంచేందుకు అహర్నిషలు శ్రమిస్తున్న మహ నాయకులు సిఎం కేసీఆర్ అని రామగుండం ఎమ్మెల్యే, హలియా టిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ కోరుకంటి చందర్ అన్నారు. మంగళవారం హలియా పట్టణంలోని లబ్ధిదారులు భారీ ఎత్తున ర్యాలీ చేపట్టారు. ముందుగా నోముల నరసింహయ్య చిత్ర పటానికి ఎమ్మెల్యేగారు పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం లబ్ధిదారుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడారు. తెలంగాణ కోసం పుట్టిన కారణజన్ములు కేసీఆర్... ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నకా సిఎంగారు రాష్ట్రంలోని సకల వర్గాల సంక్షేమం కోసం దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేస్తున్న ఘనత కేసీఆర్ దన్నారు. వృద్యాప్యంలో వున్న వృద్ధుల అండగా వారు గౌరవంగా జీవించేందుకు ఆసరా పథకం ద్వారా 2 వేల పించన్ ప్రభుత్వం అందించడం జరుగుతుందని,  దేశంలో ఎక్కడ లేని విధంగా ఒంటరి మహిళలకు 2వేల పించన్ అమలు చేస్తు వారికి పెద్దన్నలాగా సిఎం కేసీఆర్ నిలుస్తున్నరన్నారు. రైతు లేనిదే రాజ్యం లేదని రైతుల కష్టాలను తొలగించాన్న సంకల్పంతో 24 గంటల ఉచిత కరెంట్, రైతు భీమా, రైతు బంధు, ఎరువుల పంపిణి చేసి రైతుల కళ్లలో అంనందం నింపిన రైతు బంధవులు కేసీఆర్ అన్నారు. నాగర్జున సాగర్ ఉప ఎన్నికల సందర్భంగా తము ఆయా డివిజన్ లో పర్యటించిన సందర్భంలో వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, వితంతువులు కేసీఆర్ రుణం తీర్చుకుంటామని, కేసీఆర్ అందిస్తున్న  పించన్ తోనే తాము గౌరవంగా బతుకుతున్నామని,  వృద్ధ, వికలాంగులకు, ఒంటరి మహిళలు సిఎం కేసీఆర్ గారిని దేవుడిగా కోలుస్తున్నరని అన్నారు. హలియాలోని లబ్ధిదారులు సిఎం కేసీఆర్ రుణం తీర్చుకుంటామని, టిఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెబుతున్నారన్నారు. కాంగ్రెస్, బిజేపి, టిడిపి పార్టీల వారిని మీకు ఎందుకు ఓటు వేయాలని లబ్దిదారులు నిలదీయాలన్నారు. మా సంక్షేమం కోసం అహర్నిషలు కృషి చేస్తున్న సిఎం కేసీఆర్ గారికే మా ఓటు వేస్తామని చెప్పాలన్నారు. నాగర్జునసాగర్ నియోజవర్గంలో టిఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో గెలవడం ఖాయమన్నారు. లబ్ధిదారులు ఆత్మీయ సమ్మేళనం అనంతరం లబ్ధిదారులతో ఎమ్మెల్యే సహపంక్తి భోజనం చేశారు.  ఈ కార్యక్రమంలో మున్సిఫల్ చైర్మన్ పార్వతి శంకరయ్య, వైస్ చైర్మన్ సుధాకర్, కౌన్సిలర్స్ వెంకటయ్య, శ్రీనివాస్, వెంకట్ రెడ్డి, ప్రసాద్, సీనియర్ నాయకులు తక్కలపల్లి రవీందర్ రావు, మల్గిరెడ్డి లింగారెడ్డి, విజేందర్ రెడ్డి, మహేందర్ రెడ్డి, రామగుండం నగర మేయర్ డాక్టర్ బంగీ అనిల్ కుమార్, డిప్యూటి మేయర్ నడి పెల్లి అభిషేక్ రావు, కార్పోరేటర్లు పెంట రాజేష్, కుమ్మరి శ్రీనివాస్, పాముకుంట్ల భాస్కర్ నాయకులు దుర్గం రాజేశం, బోడ్డుపల్లి శ్రీనివాస్  తదితరులు పాల్గొన్నారు.
 

Related Posts