మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పీసీసీలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. ఆ రాష్ట్ర పీసీసీ పగ్గాలు సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర మంత్రి కమల్నాథ్కు అప్పగించారు. యువతకు ప్రాధాన్యత భారీగా ఉంటుందన్న అంచనాల మధ్య రాహుల్ గాంధీ సీనియర్లకు అవకాశాలు ఇవ్వడం విశేషం. మధ్యప్రదేశ్ ప్రచార కమిటీ ఛైర్మన్గా జ్యోతిరాదిత్య సింధియా, వర్కింగ్ ప్రెసిడెంట్లుగా బాల బచ్చన్, రాం నివాస్ రావత్, జితు పట్వారీ, సురేందర్ చౌదరిను నియమించారు. కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్గా దిగ్విజయ్ సింగ్ కి బాధ్యతలు అప్పగించారు.