YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ దేశీయం

సాగర్ లో కేంద్రమంత్రులు, జాతీయ నేతలు

సాగర్ లో కేంద్రమంత్రులు, జాతీయ నేతలు

నల్గొండ, మార్చి 24, నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో బీజేపీ తరఫున ప్రచారం చేసే వాళ్ల విషయంలో స్పష్టత రావడం లేదు. అయితే బీజేపీ తరపున ప్రచారం చేయడానికి కొంత మంది కేంద్ర మంత్రులు కూడా రంగంలోకి దిగవచ్చు అనే అభిప్రాయం ఉంది. వాస్తవానికి నాగార్జునసాగర్ లో సీఎం కేసీఆర్ కూడా ప్రచారం చేయవచ్చు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జానారెడ్డి బలంగా ఉండటంతో టిఆర్ఎస్ పార్టీ అగ్రనేతలు అందరూ రంగంలోకి దిగారు.ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి వంటి వాళ్లు కూడా ప్రచారం చేయడానికి రెడీ అవుతున్నారు. అవసరమైతే రాహుల్ గాంధీ కూడా తమిళనాడు ఎన్నికల ప్రచారానికి వచ్చిన సందర్భంగా ఇటు తెలంగాణ కూడా వచ్చి నాగార్జునసాగర్ లో ఒక రోజు ప్రచారం చేసే అవకాశం ఉండవచ్చుననే అభిప్రాయం ఉంది. ఇక బీజేపీ అగ్రనేతలు కొంతమంది నాగార్జునసాగర్ లో ప్రచారం చేయడానికి ఇప్పటికే మార్గం కూడా చేసుకున్నారని సమాచారం.రాష్ట్ర పార్టీ నేతలు కొంతమంది కేంద్ర మంత్రులను రావాలని కోరారు అని కూడా అంటున్నారు. ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఓటర్లు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో బీజేపీ ఎక్కువగా ప్రచారం చేయాలి. లేకపోతే ఓడిపోయే అవకాశాలు కూడా ఉండవచ్చని అంటున్నారు. కొంతమంది రాజ్యసభ ఎంపీలు కూడా ప్రచారం చేయడానికి సిద్ధమవుతున్నట్లుగా వార్తలు వినపడుతున్నాయి. జానారెడ్డి ఎదుర్కోవడానికి ఇప్పుడు బిజెపి, టిఆర్ఎస్ పార్టీలు కష్టపడుతున్నాయి.
రాహుల్ ప్రచారం
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి నాగార్జున సాగర్ ఉప ఎన్నికలు చాలా కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ప్రచారం చేయడానికి కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు కూడా రంగంలోకి దిగుతున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసే అవకాశం ఉందని సమాచారం. కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ ఇక్కడ ప్రచారం చేయడానికి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.త్వరలోనే దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఒక ప్రకటన కూడా విడుదల చేయనుంది. అయితే వారం రోజుల్లో ఈ బహిరంగ సభను ఏర్పాటు చేయాలని దీనికి సంబంధించి భారీగా జనసమీకరణ కూడా చేయాలి అని రేవంత్ రెడ్డి జానారెడ్డి వంటి నేతలు భావిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఒక ప్రణాళికను కూడా సిద్ధం చేసుకుని పెట్టుకున్నారు. అన్ని మండలాల వారీగా జానారెడ్డి కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపై నివేదిక కూడా తెప్పించుకున్నారు.అక్కడి ప్రజల్లో ఆయనపై సానుభూతి ఎక్కువగా ఉంది. గతంలో మంత్రిగా ఉన్న సమయంలో ఆయన ఎంతగానో అభివృద్ధి చేసుకున్నారు. ఇప్పుడు ఆయనను మరోసారి గెలిపించుకునే బాగుంటుంది అనే భావన కొంతమంది కాంగ్రెస్ పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. మరి ఏం జరుగుతుంది ఏంటి అనేది చూడాలి. ఇక జానారెడ్డి ఇక్కడ ఓడిపోతే కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పడవచ్చు

Related Posts