YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

సుప్రీంకోర్టు చీఫ్ జ‌స్టిస్ గా ఎన్వీ ర‌మ‌ణ

సుప్రీంకోర్టు చీఫ్ జ‌స్టిస్ గా ఎన్వీ ర‌మ‌ణ

న్యూఢిల్లీ మార్చ్ 24
త‌న త‌ర్వాత చీఫ్ జ‌స్టిస్ ఆఫ్ ఇండియాగా ఎన్వీ ర‌మ‌ణ పేరును సిఫార‌సు చేశారు‌ ప్ర‌స్తుత సీజేఐ ఎస్ఏ బోబ్డే. ఆయ‌న ప‌ద‌వీ కాలం ఏప్రిల్ 23తో ముగుస్తోంది. దీంతో త‌న వారసుడి పేరును సిఫార‌సు చేయాల్సిందిగా ప్ర‌భుత్వం బోబ్డేను కోరింది. గ‌త శుక్ర‌వార‌మే కేంద్ర న్యాయ‌శాఖ మంత్రి ర‌విశంక‌ర్ ప్ర‌సాద్ ఈ మేర‌కు బోబ్డేకు లేఖ రాశారు. బోబ్డే త‌ర్వాత ఎన్వీ ర‌మ‌ణ‌నే సుప్రీంకోర్టులో అత్యంత సీనియ‌ర్ న్యాయ‌మూర్తిగా ఉన్నారు. 1957, ఆగ‌స్ట్ 27న జ‌న్మించిన ర‌మ‌ణ ప‌ద‌వీ కాలం 2022, ఆగ‌స్ట్ 26తో ముగుస్తుంది. నిబంధ‌న‌ల ప్ర‌కారం సుప్రీంకోర్టులో అత్యంత సీనియ‌ర్‌కే చీఫ్ జ‌స్టిస్ ఆఫ్ ఇండియా ప‌ద‌వి ద‌క్కాల్సి ఉంటుంది. 2017, ఫిబ్ర‌వ‌రి 14 నుంచి ర‌మ‌ణ సుప్రీంకోర్టు జ‌డ్జిగా ఉన్నారు. అంత‌కుముందు ఆరు నెల‌ల పాటు ఆయ‌న ఢిల్లీ హైకోర్టు చీఫ్ జ‌స్టిస్‌గా ప‌ని చేశారు. 2000, జూన్ 27 నుంచి 2013, సెప్టెంబ‌ర్ 1 వ‌ర‌కు ఎన్వీ ర‌మ‌ణ ఆంధ్ర‌ప్ర‌దేశ్ హైకోర్టులో జ‌డ్జిగా ప‌ని చేశారు. కృష్ణా జిల్లా పొన్న‌వ‌రంలో ఓ వ్య‌వ‌సాయ కుటుంబంలో ఆయ‌న జ‌న్మించారు.

Related Posts