YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

నామినేషన్ దాఖలు చేసిన పనబాక

నామినేషన్ దాఖలు చేసిన పనబాక

నెల్లూరు
ఆంధ్రప్రదేశ్ కు  ప్రత్యేక హోదా, విభజన హామీల సాధనలో విఫలమైన వైకాపా ఎంపీలకు పదవుల్లో కొనసాగేందుకు అర్హత లేదని తెదేపా మండిపడింది. తిరుపతి లోక్సభ స్థానానికి ఆపార్టీ తరఫున పనబాక లక్ష్మి ఇవాళ నామినేషన్ వేశారు. అంతకు ముందు నెల్లూరు వీఆర్సీ కూడలి నుంచి తెదేపా నేతలు కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. పార్టీ కీలక నేతలు యనమల, సోమిరెడ్డి, అచ్చెన్నాయు డు.. పనబాక లక్ష్మికి మద్దతుగా ర్యాలీలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణలో వైకాపా విఫలమైనందున ఢిల్లీలో బలంగా గళం వినిపించేందుకు పనబాక లక్ష్మిని గెలిపించాలని వారు కోరారు.

Related Posts