YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

జ్ఞాన జ్యోతి ప్రదాత పోతులూరి వీర‌బ్ర‌హ్మేంద్ర‌స్వామి

జ్ఞాన జ్యోతి ప్రదాత పోతులూరి వీర‌బ్ర‌హ్మేంద్ర‌స్వామి

శ్రీ జ‌గ‌ద్గురు శ్రీ మ‌ద్విరాట్ పోతులూరి వీర‌బ్ర‌హ్మేంద్ర‌స్వామి వారి 325 వ ఆరాధ‌న ఉత్స‌వాల సంద‌ర్భంగా మేడ్చల్ జిల్లా బాలాజీ నగర్లోని ముత్తు స్వామి,చంద్రగిరి కాలనీలో గల  పోతులూరి వీర బ్రహ్మేంద్ర‌స్వామి ఆలయం లో  ఆరాధ‌న ఉత్స‌వాలు ఘనంగా జరిగాయి.ఈ సందర్బంగా పోతులూరి వీర బ్రహ్మేంద్ర‌స్వామికి కపూలమాలలు వేసి ఘన్నంగా పూజలు   నిర్వహించారు. ఈ సందర్బంగా ఆలయ చేర్మెన్ ముచ్చెర్ల పెంటా చారి మాట్లాడుతూ పోతులూరి వీర బ్రహ్మేంద్ర‌స్వాముల వారు త‌మ తత్వాల ద్వారా, ఇత‌ర ర‌చ‌న‌ల ద్వారా సామాజిక విప్ల‌వాన్ని సాధించిన మ‌హానీయుడ‌ని, స‌మాజంలోని మూఢ  విశ్వాసాల‌ను ఖండిస్తూ.. అజ్ఞానంలో మ‌గ్గిపోతున్న మాన‌వాళికి జ్ఞానోద‌యాన్ని క‌ల్గించిన జ్ఞాన జ్యోతి అని అన్నారు.కుల‌,మత, వ‌ర్గ వ‌ర్ణాల‌కు అతీతంగా స్వామివారి బోధ‌న‌లు అన్నివ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు వాస్త‌విక‌త‌ను తెలియ‌జెప్పాయని అన్నారు. ప్ర‌భుత్వ ప‌రంగా శ్రీ పోతులూరి వీర‌బ్ర‌హ్మేంద్ర స్వామివారి జ‌యంతి మ‌రియు ఆరాధ‌న దినోత్స‌వాలు జ‌రపాలని ప్ర‌భుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో చంద్రగిరి కాలని  విశ్వభ్రామ్మన సంఘం అద్యక్షులు మారోజు రమేష్ బాబు,ఉపాధ్యక్షులు ఆకుల ఆంజనేలు,ప్రధాన కార్య దర్శి గడ్డోజు చంద్రయ్య చారి,కోశాధి కారి ఆకుముని నాగేష్ చారి,గాంధారి సుధాకర చారి,మద్దోజు సోమా చారి,లక్ష్మినరయన చారి,రవీందర్ చారి,జి.సోమయ్య,ప్రసాద్ చారి,కనకా చారి,భ్రమ్మ చారి,వెంకటేశ్వర్లు చారి,తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.

Related Posts