హైదరాబాద్ మార్చి 25,
బుధవరం నాడు తెలంగాణ శాసనసభ అవరణలో ఎమ్మెల్సీ వాణీ దేవి వాహనానికి ప్రమాదం జరిగింది. ఘటన సమయంలో వాణీదేవి వాహనంలో లేరు. ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. డ్రైవర్ బదులు గన్ మెన్ నడపటం తో ప్రమాదం జరిగింది. బ్రేక్ తొక్కబోయి యాక్సిలేటర్ తొక్కిన గన్ మెన్ దాంతో వందకు పైగా స్పీడ్ తో గన్ మెన్లపైకి దూసుకుపోయింది. తరువాత గేట్ నెంబర్ 8 ని ఢీ కొట్టింది. శాసనసభ సమావేశాలు జరుగుతుండడంతో పోలీసులు పెద్ద ఎత్తున అసెంబ్లీ గేటు దగ్గరుంటారు. అదృష్టవశాత్తూ చాలామందికి ప్రాణాపాయం తప్పిందని భద్రతా సిబ్బంది అంటున్నారు. ఎమ్మెల్సీ వాణీదేవి కారు నడిపి ప్రమాదానికి కారణమైన పీఎస్ఓను సీపీ అంజనీ కుమార్ సస్పెండ్ చేసారు.