హైదరాబాద్ మార్చ్ 25 అసెంబ్లీ లో నా నియోజకవర్గ సమస్యలు మాట్లాడే అవకాశం రాకపోవడంతో ట్యాంక్ బండ్ అంబెడ్కర్ విగ్రహం నుంచి అసెంబ్లీ వరకు పాదయాత్ర చేసానని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. సంగారెడ్డి లో మెడికల్ కాలేజీ ఏర్పాటు కు ప్రతిపాదనలు పంపాం. కానీ నా నియోజకవర్గ మెడికల్ కాలేజీ ని సిద్దిపేట కు తరలించారు. 2013లో 5వేల మందికి నా నియోజకవర్గంలో ఇళ్ళ పట్టాలు ఇచ్చాం..కానీ టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక వాళ్ళను ఆ స్థలాల నుంచి కాళీ చేయించారు. సంగారెడ్డి కి మెడికల్ కాలేజీ ఇస్తామని కేసీఆర్ ఎన్నికల హామీ ఇచ్చారు.. అసెంబ్లీ సాక్షి గా కూడా చెప్పారు. వెయ్యి కోట్ల రూపాయలు మెడికల్ కాలేజీ స్ట్రక్చర్ కోసం అడిగినా ఇవ్వట్లేదని విమర్శించారు. 40వేల మంది పేదలు ఇళ్ళు లేక ఇబ్బంది పడుతున్నారు.. వారందరికీ ఇళ్ళ స్థలాలు ఇవ్వమంటె స్పందన లేదు. కనీసం నియోవర్గ అభివృద్ధి కి రెండు వేల కోట్లు ఇవ్వాలని అడిగినా స్పందన లేదు. అసెంబ్లీ లో మాట్లాడేందుకు మా పార్టీ కి కొంచెం సమయం ఇచ్చి మైక్ కట్ చేస్తున్నారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం నా నియోజకవర్గ డిమాండ్ లను పరిష్కరించాలని అయన డిమాండ్ చేసారు.