YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

29న ఢిల్లీలో ప్ర‌జా ఆగ్ర‌హా ర్యాలీ ఏపీసీసీ చీఫ్ ర‌ఘువీరారెడ్డి

29న ఢిల్లీలో ప్ర‌జా ఆగ్ర‌హా ర్యాలీ             ఏపీసీసీ చీఫ్ ర‌ఘువీరారెడ్డి

ఏఐసీసీ అధ్య‌క్ష‌డు రాహుల్ గాంధీ ఆధ్వ‌ర్యంలో ఈ నెల 29న ఢిల్లీలో ‘ప్ర‌జా ఆగ్ర‌హా ర్యాలీ’ నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్షుడు ఎన్‌.ర‌ఘువీరారెడ్డి తెలిపారు. న్యూఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో జాతీయ ప్రజా ఆగ్రహా ర్యాలీ నిర్వహిస్తున్నా మని, దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ నాయ‌కులు అభిమానులు, కార్య‌క‌ర్త‌లు ఈ ర్యాలీలో పాల్గొని విజ‌య‌వంతం చేయాల‌ని పిలుపు నిచ్చారు. భారతదేశంలోని ప్రతి రాష్ట్రంలో, ప్రత్యేకంగా బీజేపీ పాలిత రాష్ట్రాలలో ప్రజలు దోపిడీకి గురైన పాలనలో ఉన్నారని, నిరుద్యోగ పెరుగుదల, మహిళలపై పెరుగుతున్న అత్యాచారాలు, రైతు ఆత్మహత్యలపై నిరసన తెలుపుతూ ఈ ర్యాలీ నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ ర్యాలీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మ‌హిళా, ఓబీసీ విభాగం, మత్స్యకారుల కాంగ్రెస్, అసంఘటిత వర్కర్స్ కాంగ్రెస్,  వివిధ విభాగాల కాంగ్రెస్ నాయ‌కులు అధిక సంఖ్య‌లో పాల్గొంటార‌ని తెలిపారు.

Related Posts