YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

భార్యను హతమార్చిన భర్త

భార్యను హతమార్చిన భర్త

రంగారెడ్డి మార్చి 30, 
రంగారెడ్డి జిల్లా యాచారం మండలం పరిధిలోని తక్కల్లపల్లి తండాలో దారుణం జరిగింది.  భార్య భర్తల మధ్య గొడవల నేపధ్యంలో భార్య రామవత్ లలితను భర్త రామవతు్ శ్రీను కొడ్డలితో నరికి హత్య చేసాడు. పోలీసులు కథనం ప్రకారం శ్రీను వృత్తి రీత్యా ఆటోడ్రైవర్.  హైదరాబాద్ లో ఆటో నడిపి నిత్యం మధ్యం సేవించి భార్యతో గొడవ పడే వాడు. లలిత,  శ్రీను దంపతులకు ముగ్గురు పిల్లలు. పెద్ద కూతురు పెళ్లి చేశారు. ఇంకో కూతురు కుమారుడు ఉన్నాడు. రాత్రి కూడా మద్యం సేవించి భార్యతో గొడవ పడి అర్ధ రాత్రి సమయంలో మద్యం మత్తులో గొడ్డలితో భార్యను నరికి చంపాడని పోలీసులు, స్థానికులు వెల్లడించారు. యాచారం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Related Posts