YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

అచ్చెన్న.. ఫెయిల్యూర్ స్టోరీనా

అచ్చెన్న.. ఫెయిల్యూర్ స్టోరీనా

విజయవాడ, మార్చి 31, 
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకత్వం లో కూడా కొన్ని మార్పులు చేయడానికి కూడా చంద్రబాబు నాయుడు సిద్ధమవుతున్నట్లు సమాచారం. పార్టీలో ఉన్న కొన్ని సమస్యల పరిష్కారానికి చంద్రబాబునాయుడు దృష్టికి పెట్టినట్టుగా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. గత కొన్ని రోజులుగా పార్టీలో విభేదాలతో చాలామంది నాయకులు పార్టీలో ఉండడానికి ఇష్టపడకపోవడంతో చంద్రబాబు నాయుడు కూడా ఒకింత ఇబ్బంది ఫీల్ అవుతున్నారు.అందుకే ఇప్పుడు రాష్ట్ర నాయకత్వం లో మార్పులు చేసేందుకు చంద్రబాబు నాయుడు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. అలాగే జాతీయ కమిటీ లో కూడా కొన్ని మార్పులు చేసేందుకు చంద్రబాబు నాయుడు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నట్లు గా సమాచారం. టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విషయంలో చాలామంది నాయకులు ఇబ్బంది పడుతున్నారు అనే విషయం టిడిపి వర్గాల్లో ఈ మధ్యకాలంలో ఎక్కువగా ప్రచారంలో ఉంది.దీనితో చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆయనను మార్చే ఆలోచనలో ఉన్నారని కూడా కొంతమంది వ్యాఖ్యలు చేస్తున్నారు. తిరుపతి ఉప ఎన్నికల ప్రచారం సందర్భంగా చాలా మంది నాయకులు ప్రచారం చేయడం లేదు. దీనికి ప్రధాన కారణం రాష్ట్ర అధ్యక్షుడు అనే విషయాన్ని చంద్రబాబు గ్రహించినట్టుగా టిడిపి వర్గాలంటున్నాయి. దీనికి సంబంధించి త్వరలో చంద్రబాబు నుంచి కొన్ని కీలక ప్రకటన కూడా రావచ్చు. తిరుపతి ఉప ఎన్నికల తర్వాత రాష్ట్ర నాయకత్వం లో చంద్రబాబు మార్పులు చేయవచ్చని అంటున్నారు.మొన్నటి వరకూ చంద్రబాబు నచ్చని పదం ఏకగ్రీవం. ఇప్పుడు ఎన్నికలయిపోయాక పదం మారింది. సరెండర్. అనేక మంది టీడీపీ నేతలు వైసీపీకి సరెండర్ అయిపోయేందుకు సిద్ధమయిపోవడమే చంద్రబాబు కలవరానికి కారణం. రెండేళ్లయినా ఏపీ ముఖ్యమంత్రి జగన్ గ్లామర్, ఇమేజ్ ఏమాత్రం తగ్గలేదు. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో జగన్ క్లీన్ స్వీప్ చేసేశారు. నిజింగా చెప్పాలంటే ఇది జగన్ విజయమే.అభ్యర్థులు ఎవరైనా, మంత్రులు ఎంతమంది ప్రచారం చేసినా వైసీపీకి విజయం దక్కిందంటే దానికి జగన్ ఫొటోయే కారణమని చెప్పక తప్పదు. తాను కదలకుండా ప్రచారానికి వెళ్లకుండా ఇచ్ఛాపురం నుంచి ఇడుపులపాయ వరకూ టీడీపీపై జగన్ దండయాత్ర చేసేశారు. దీంతో టీడీపీ సీనియర్ నేతలు కూడా పునరాలోచనలో పడ్డారు. చంద్రబాబుపై సీఐడీ కేసు నమోదు అయిన సమయంలో టీడీపీ నేతల నుంచి వచ్చిన స్పందన కూడా అంతంత మాత్రమే.ఒకరిద్దరూ మాజీ మంత్రులు స్పందించారు తప్పించి ఎవరూ దీనిని పెద్దగా పట్టించకోలేదు. దీంతో పాటు టీడీపీ గెలిచిన ఒకే ఒక్క మున్సిపాలిటీ తాడిపత్రి. ఇక్కడ జేసీ బ్రదర్స్ వ్యక్తిగత విజయమేనని చెప్పాలి. జేసీ బ్రదర్స్ కూడా ఇదే చెప్పారు. తమ వల్లనే తాడిపత్రి గెలుచుకున్నామని, ఇక్కడ టీడీపీ విజయం కాదని చెప్పారు. అదే సమయంలో ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా పార్టీకి ఇబ్బందికరంగా మారాయి.తాను అవసరమైతే జగన్ ను కలుస్తానని జేసీ ప్రభాకర్ రెడ్డి వంటి నేత చెప్పడం పార్టీ నేతలను ఆలోచనలో పడేసిందంటున్నారు. ఇప్పటికే అనంతపురం జిల్లాలో మాజీ మంత్రులు కాల్వ శ్రీనివాసులు, పల్లె రఘునాధరెడ్డి, కేఈ కృష్ణమూర్తి, పయ్యావుల కేశవ్ వంటి వాళ్లు సైలెంట్ అయ్యారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో నేతల్లో మరింత కలవరం మొదలయిందంటున్నారు. కొందరు ఇప్పటికే వైసీపీ సీనియర్ నేతలతో టచ్ లోకి వెళ్లారని చెబుతున్నారు. సరెండర్ అవ్వడమే శరణ్యమని ఎక్కువ మంది భావిస్తుండటం చంద్రబాబులో కలవరానికి ప్రధాన కారణం అని చెప్పాలి.

Related Posts