YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

కేంద్రాన్ని టార్గెట్ చేసిన విపక్షాలు

 కేంద్రాన్ని టార్గెట్ చేసిన విపక్షాలు

సుప్రీంకోర్టు జడ్జిల నియామకంపై విపక్షాలు కేంద్రాన్ని టార్గెట్ చేశాయి. ఈ నిర్ణయంపై వరుస ట్వీట్లతో కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం కేంద్రాన్ని విమర్శించారు. ఇందూ మల్హోత్రా న్యాయమూర్తిగా ఎంపికైనందుకు సంతోషంగా ఉంది... జస్టిస్ జోసెఫ్ నియామకాన్ని పక్కన పెట్టడం బాధకరమన్నారు. చట్ట ప్రకారం కొలీజయం సిఫార్సు చేసిందే తుది నిర్ణయం... ఆ మేరకే నియామకం జరగాలని... ప్రభుత్వం చట్టం కంటే ఎక్కువా అని ప్రశ్నించారు. జస్టిస్ జోసెఫ్ నియామకాన్ని పక్కన పెట్టడానికి కారణం ఏంటి? ఆయన రాష్ట్రమా? మతమా? ఉత్తరాఖండ్ కేసులో ఆయన తీర్పా అంటూ ట్వీట్లు చేశారు.ఈ వ్యవహారంపై చిదంబరం మాత్రమే కాదు... సీపీఎం కూడా తప్పుబట్టింది. జస్టిస్ జోసెఫ్‌ను న్యాయమూర్తిగా నియమించకపోవడం న్యాయవ్యవస్థ స్వతంత్రతకు భంగం కలింగించడమేనన్నారు నేతలు. దీనిపై రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలని కోరారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకం కోసం కొలీజియం ఇద్దరు పేర్లను సిఫార్సు చేసింది. సీనియర్‌ న్యాయవాది ఇందూ మల్హోత్రా... ఉత్తరాఖండ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ కె.ఎం. జోసెఫ్‌ పేర్లను ప్రతిపాదించింది. అయితే వీరిలో ఇందూ మల్హోత్రా నియామకాన్ని మాత్రమే కేంద్రం అంగీకరిస్తూ జస్టిస్‌ జోసెఫ్‌ను పక్కన పెట్టింది. దీంతో ఇది వివాదాస్పదంగా మారింది.

Related Posts