YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

సిగ్గు, శరం లేకుండా తిరుగుతున్న వ్యక్తులు చంద్రబాబు, లోకేష్ మంత్రి కోడాలి నాని

సిగ్గు, శరం లేకుండా తిరుగుతున్న వ్యక్తులు చంద్రబాబు, లోకేష్ మంత్రి కోడాలి నాని

గుడివాడ ఏప్రిల్ 1,
గుడివాడ పట్టణంలో 16 కోట్ల పది లక్షల నిధులతో నిర్మించనున్న పాత కంకిపాడు రహదారి నిర్మాణ పనులకు పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని, ఎంపీ వల్లభనేని బాలశౌరి శంకుస్థాపన చేసారు.  ఈ కార్యక్రమంలో మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ మంత్రి లోకేష్ లపై విరుచుకుపడ్డారు. మంత్రి మాట్లాడుతూ జగన్ పై పిచ్చి వాగుడులు వాగితే తుప్పు నాయుడు, పప్పు నాయుడు అంతు చూస్తాం. ఎన్నికల ఫలితాల ద్వారా ప్రజలు  కాండ్రించి ఉమ్ము వేసిన సిగ్గు శరం లేకుండా తిరుగుతున్న వ్యక్తులు చంద్రబాబు, లోకేష్. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని సైకో రెడ్డి అంటున్న, లోకేష్ కు రోజులు దగ్గర పడ్డాయి. పప్పు నాయుడు తండ్రే పెద్ద సైకో నాయుడు, సొల్లు నాయుడు, చీటర్ అన్నారు. ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి దయతోనే చంద్రబాబు,లోకేష్ హైదరాబాద్ తిరిగి వెళుతున్నారు. ముఖ్యమంత్రిగా 14 ఏళ్లుగా ఏం పికలేని చంద్రబాబు , ఇప్పుడు చేసేది ఏమి ఉండదు. సామాజిక మాధ్యమాల్లో తమను తిడితే మీ అమ్మ ల వరకు మేము తిడతామని అన్నారు. లోకేష్, చంద్రబాబులను రోడ్డు మీద బట్టలు లేకుండా తిప్పే రోజులు దగ్గర పడ్డాయి. చరిత్రలో నిలిచిపోయేలా ఒక్కొక్క నియోజకవర్గాన్ని వెయ్యి కోట్లకు పైగా నిధులతో అభివృద్ధి చేస్తుంటే ప్రతిపక్షాలకు కనబడకపోవడం విడ్డూరం. హైదరాబాద్ లో ఉండే వెధవలకు రాష్ట్ర అభివృద్ధి ఏం తెలుస్తుంది. చవట దద్దమ్మ నిమ్మగడ్డ ఏం సాధించాడు, జిల్లా పరిషత్ ఎన్నికలు పెట్టకుండా పారిపోయాడు. పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో చంద్రబాబు మాడుపగిలితే, మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో వాత పెట్టారని అన్నారు. చంద్రబాబు లాంటి చవట, లోకేష్ లాంటి పప్పు లు శత్రువులకు కూడా పుట్టకుడదని ప్రజలు అనుకుంటున్నారని మంత్రి అన్నారు.
 

Related Posts