YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు దేశీయం

నందిగ్రామ్‌ లో హింస బీజేపీ అభ్య‌ర్థి సువేందు అధికారి కాన్వాయ్‌పై రాళ్ల దాడి

నందిగ్రామ్‌ లో  హింస  బీజేపీ అభ్య‌ర్థి సువేందు అధికారి కాన్వాయ్‌పై రాళ్ల దాడి

నందిగ్రామ్‌ ఏప్రిల్ 1 
ప‌శ్చిమ బెంగాల్ ఎన్నిక‌ల్లో ప్ర‌తిష్టాత్‌్కంగా భావిస్తున్న నందిగ్రామ్‌ లో  పోలింగ్ స‌ర‌ళిని ప‌రిశీలిస్తున్న బీజేపీ అభ్య‌ర్థి సువేందు అధికారి కాన్వాయ్‌పై రాళ్ల దాడి జ‌రిగింది. అయితే ఈ ఘ‌ట‌న‌లో సువేందు మాత్రం గాయ‌ప‌డ‌లేదు. నందిగ్రామ్‌లోని స‌తేన్‌గ‌బ‌రి ప్రాంతంలో ఈ దాడి జ‌రిగింది. సువేందు కాన్వాయ్ వెంటే ఉన్న మీడియా వాహ‌నం ఈ రాళ్ల దాడిలో ధ్వంస‌మైంది.మ‌రోవైపు ప‌శ్చిమ మిడ్నాపూర్‌లో మ‌రో బీజేపీ అభ్య‌ర్థి ప్రీతిశ‌రంజ‌న్ కోనార్ కాన్వాయ్‌పై కూడా దాడి జరిగిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. రెండో విడ‌త‌లో భాగంగా బెంగాల్‌లో నందిగ్రామ్ స‌హా 30 నియోజ‌క‌వ‌ర్గాల్లో పోలింగ్ జ‌రుగుతోంది. అయితే ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ పోటీ చేస్తున్న నందిగ్రామ్‌పైనే అందరి దృష్టి కేంద్రీకృత‌మైంది. ఇప్ప‌టికే ఇక్క‌డ జ‌రిగిన హింస‌లో ఓ బీజేపీ కార్య‌క‌ర్త మృతి చెందాడు.

Related Posts