జయానగర్ ఏప్రిల్ 1
పశ్చిమ బెంగాల్లో ఇవాళ ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. జయానగర్లో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. బెంగాల్లో బీజేపీకి 200 సీట్లు వస్తాయని కొన్ని వారాల క్రితం జనం అనుకున్నారని, అయితే తొలి దశ ఎన్నికల్లో బీజేపీకి మంచి స్టార్ట్ వచ్చిందని, ప్రజల గొంతుకు దేవుడి ఆశీస్సులు లభించినట్లు ప్రధాని తెలిపారు. బెంగాల్లో ఈసారి బీజేపీకి 200 కన్నా ఎక్కువే సీట్లు వస్తాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఇవాళ రెండవ దశ పోలింగ్ జరుగుతోందని, పోలింగ్ బూత్కు భారీ సంఖ్యలో ఓటర్లు వస్తున్నారని, ఎక్కడ చూసినా బీజేపీ హవా ఉందని, బెంగాల్లో బీజేపీ హవా కొనసాగుతోందన్నారు. కూల్ కూల్ అని దీదీ అంటున్నారని, తృణమూల్ కూల్గా లేదని, అది శూలంగా మారిందని, ఆ శూలం వల్ల ప్రజలు విపరీతగా బాధపడుతున్నారని ప్రధాని ఆరోపించారు. జై శ్రీ రామ్ లాంటి నినాదాలతోనూ మమతా బెనర్జీ ఇబ్బందిపడుతోందన్నారు. దుర్గామాత ప్రతిమలను నిమజ్జనం చేసినా, తిలకం దిద్దుకున్నా.. కాషాయ వస్త్రాలను చూసినా.. దీదీకి సమస్యగా మారిందన్నారు.