YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

గ్రామ పంచాయతీల విలీనంపై విచారణ ఏప్రిల్ 20కి వాయిదా

గ్రామ పంచాయతీల విలీనంపై విచారణ ఏప్రిల్ 20కి వాయిదా

అమరావతి ఏప్రిల్ 1
గ్రామ పంచాయతీలను పురపాలక సంఘాలు, నగరపాలక సంస్ధల్లో కలుపుతూ ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌ను సవాల్‌ చేస్తూ హైకోర్టులో 70 పిటిషన్లు దాఖలయ్యాయి. మొత్తం 70 పిటిషన్లపై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. గతంలో పంచాయతీల విలీనాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం చేయటంతో హైకోర్టు స్టే ఇచ్చింది. ఈ ఉత్తర్వులన్నింటినీ అధిగమించేందుకు ప్రభుత్వం గతేడాది ఆర్డినెన్స్‌ తీసుకువచ్చింది. పంచాయతీ రాజ్‌ చట్టానికి సవరణలు చేయకుండా ఆర్డినెన్స్‌ ఎలా తీసుకువస్తారని హైకోర్టులో పిటిషనర్లు తమ వాదనలు వినిపించారు. గ్రామాల స్వరూపం మారిపోతోందని ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. విలీనమైన పురపాలక సంఘానికి 15 కిలో మీటర్ల దూరంలో గ్రామం ఉంటే ఎలా అభివృద్ధి చెందుతుందని పిటిషనర్లు తమ పిటిషన్‌లో పేర్కొన్నారు. 70 పిటిషన్లు ఉండటంతో ఈరోజు మధ్యాహ్నం వరకు కొంత మంది న్యాయవాదుల వాదనలు విన్న హైకోర్టు.. మిగతా పిటిషనర్ల తరపున వాదనలు వినేందుకు ఈనెల 20వ తేదీకి కేసు విచారణను వాయిదా వేసింది.

Related Posts