YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

డీఎంకే నేత ఏ రాజాపై ఎన్నిక‌ల సంఘం ఆంక్ష‌లు

డీఎంకే నేత ఏ రాజాపై ఎన్నిక‌ల సంఘం ఆంక్ష‌లు

న్యూఢిల్లీ ఏప్రిల్ 1
డీఎంకే నేత ఏ రాజాపై ఎన్నిక‌ల సంఘం ఆంక్ష‌లు విధించింది. 48 గంట‌ల పాటు ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించ‌రాదు అని త‌న ఆదేశాల్లో పేర్కొన్న‌ది. త‌క్ష‌ణ‌మే ఈ ఆదేశాలు అమ‌ల్లోకి రానున్నాయి. త‌మిళ‌నాడు సీఎం ప‌ళ‌నిస్వామిపై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన ఘ‌ట‌న‌లో ఈసీ ఈ ఆదేశాలు ఇచ్చింది. ఇటీవ‌ల ఓ ప్ర‌చార స‌భ‌లో రాజా మాట్లాడుతూ.. సీఎం ప‌ళ‌నిస్వామి త‌ల్లి గురించి అనుచిత వ్యాఖ్య‌లు చేశారు. ఆ ఘ‌ట‌న‌లో ఏ రాజా క్ష‌మాప‌ణ‌లు కూడా చెప్పారు. రాజా చేసిన వ్యాఖ్య‌లు అస‌భ్య‌క‌రంగా ఉన్నాయ‌ని, మ‌హిళల గౌర‌వాన్ని కించ‌ప‌రుస్తున్న‌ట్లు ఉన్నాయ‌ని, ఇది ఎన్నిక‌ల నియ‌మావ‌ళిని ఉల్లంఘించ‌డ‌మే అవుతుంద‌ని ఎన్నిక‌ల సంఘం ఆరోపించింది. ఏప్రిల్ ఆరో తేదీన త‌మిళ‌నాడులో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే.

Related Posts