న్యూఢిల్లీ ఏప్రిల్ 1
డీఎంకే నేత ఏ రాజాపై ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. 48 గంటల పాటు ఎన్నికల ప్రచారం నిర్వహించరాదు అని తన ఆదేశాల్లో పేర్కొన్నది. తక్షణమే ఈ ఆదేశాలు అమల్లోకి రానున్నాయి. తమిళనాడు సీఎం పళనిస్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఘటనలో ఈసీ ఈ ఆదేశాలు ఇచ్చింది. ఇటీవల ఓ ప్రచార సభలో రాజా మాట్లాడుతూ.. సీఎం పళనిస్వామి తల్లి గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ ఘటనలో ఏ రాజా క్షమాపణలు కూడా చెప్పారు. రాజా చేసిన వ్యాఖ్యలు అసభ్యకరంగా ఉన్నాయని, మహిళల గౌరవాన్ని కించపరుస్తున్నట్లు ఉన్నాయని, ఇది ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమే అవుతుందని ఎన్నికల సంఘం ఆరోపించింది. ఏప్రిల్ ఆరో తేదీన తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.