YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

బాథ్యతలు స్వీకరించిన నీలం సాహ్నీ

బాథ్యతలు స్వీకరించిన నీలం సాహ్నీ

విజయవాడ, ఏప్రిల్ 1, 
ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై ఫోకస్ పెట్టారు ఎస్ఈసీ నీలం సాహ్నీ. పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత గవర్నర్‌ హరిచందన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.. ఈ భేటీలో ఎన్నికల నిర్వహణపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది.. ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఆ తర్వాత ఎస్ఈసీతో సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ సమావేశమయ్యారు.. ఎన్నికలపై చర్చించారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు వెంటనే నిర్వహించాలని ఎస్ఈసీని సీఎస్ కోరారు.‌ ఎన్నికలు పూర్తి అయితే వ్యాక్సినేషన్ ప్రక్రియని వేగవంతం చేయాల్సి ఉందన్నారు.మరోవైపు సాయంత్రం 4 గంటలకు ఎస్ఈసీ 13 జిల్లాలో కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ప్రధానంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణపై సమీక్ష చేయనున్నారు. ఈ సమావేశంలో సీఎస్‌, డీజీపీ పాల్గొని ఎన్నికల నిర్వహణ, భద్రతా ఏర్పాట్లకు సంబంధించిన అంశాలపై చర్చించనున్నారు. సమావేశం అనంతరం ఎస్‌ఈసీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.మార్చి 7న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణ ప్రక్రియ పూర్తయిన తర్వాత కొవిడ్‌ కేసులు పెరగడంతో మార్చి 15న అప్పటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ ఎన్నికలు వాయిదా వేశారు. అప్పటి నుంచి పెండింగ్‌లో ఉండగా.. గత నెలలో నిర్వహిస్తారని భావించినా కుదరలేదు. నీలం సాహ్నీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత కసరత్తు మొదలుపెట్టారు

Related Posts