YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

తైవాన్‌లో ప‌ట్టాలు త‌ప్పిన రైలు.. 36 మంది మృతి

తైవాన్‌లో ప‌ట్టాలు త‌ప్పిన రైలు.. 36 మంది మృతి

తైవాన్‌ ఏప్రిల్ 2 
తైవాన్‌లోని హువాలియ‌న్ ప్రావిన్సులో రైలు ప‌ట్టాలు త‌ప్పింది. 350 మంది ప్ర‌యాణికుల‌తో వెళ్తున్న రైలు ఓ ట‌న్నెల్ వ‌ద్ద ఇంజినీరింగ్ వాహ‌నాన్ని ఢీకొట్టింది. ఆ వాహ‌నాన్ని ఢీకొట్ట‌డంతో.. రైలు ట‌న్నెల్‌లోనే ప‌ట్టాలు త‌ప్పింది. ఈ ప్ర‌మాదంలో 36 మంది ప్ర‌యాణికులు మృతిచెందారు. 72 మందికి తీవ్రంగా గాయాల‌య్యాయి. ట‌న్నెల్‌లో చిక్కుకున్న నాలుగు బోగీల‌ను తొల‌గించేందుకు అధికారులు ప్ర‌య‌త్నిస్తున్నారు. తైవాన్‌లో ప్ర‌స్తుతం టాంబ్ ఉత్స‌వాలు జ‌రుగుతున్నాయి. ఈ స‌మ‌యంలో అక్క‌డ రైలు ట్రాఫిక్ భారీ స్థాయిలో ఉంటుంది. ప‌ట్టాలు త‌ప్పిన బోగీల నుంచి సుమారు వంద మంది ప్ర‌యాణికుల‌ను ర‌క్షించిన‌ట్లు రైల్వే అధికారులు తెలిపారు. దాకింగ్‌షుయి ట‌న్నెల్ వ‌ద్ద రైలు ప్ర‌మాదం జ‌రిగింది.

Related Posts