YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

స‌చిన్ టెండూల్క‌ర్ కు క‌రోనా హాస్పిట‌ల్‌లో చేరిక

స‌చిన్ టెండూల్క‌ర్ కు క‌రోనా హాస్పిట‌ల్‌లో చేరిక

ముంబై ఏప్రిల్ 2 
 క‌రోనా వైర‌స్ సంక్ర‌మించిన స‌చిన్ టెండూల్క‌ర్ ఇవాళ హాస్పిట‌ల్‌లో చేరారు. మాజీ టీమిండియా క్రికెట‌ర్‌, మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ ఈ విష‌యాన్ని త‌న ట్విట్ట‌ర్‌లో వెల్ల‌డించారు. తాను కోలుకోవాల‌ని ప్రార్థ‌న‌లు చేసిన వారికి థ్యాంక్స్ తెలిపారు. అయితే వైద్యులు ఇచ్చిన సూచ‌న మేర‌కు హాస్పిట‌ల్‌లో చేరిన‌ట్లు ఆ ట్వీట్‌లో స‌చిన్ తెలిపారు. త్వ‌ర‌లోనే క్షేమంగా ఇంటికి వ‌స్తాన‌న్న ఆశాభావాన్ని కూడా స‌చిన్ వ్య‌క్తం చేశారు. ప్ర‌తి ఒక్క‌రూ జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని, ఇంటి వ‌ద్దే సుర‌క్షితంగా ఉండాలంటూ త‌న ట్వీట్‌లో స‌చిన్ కోరారు. మార్చి 27వ తేదీన స‌చిన్‌కు క‌రోనా సంక్ర‌మించింది. ఆ రోజు ట్విట్ట‌ర్‌లో ఈ విష‌యాన్ని వెల్ల‌డించిన స‌చిన్‌.. క్వారెంటైన్‌లో ఉన్న‌ట్లు పేర్కొన్నారు.తాజాగా నిర్వ‌హించిన టెస్టింగ్‌లో క‌రోనా పాజిటివ్ వ‌చ్చిన‌ట్లు ఆ ట్వీట్‌లో స‌చిన్ పేర్కొన్నారు. స్వ‌ల్పంగా త‌న‌కు ల‌క్ష‌ణాలు ఉన్న‌ట్లు తెలిపారు. ఇంట్లో ఉన్న ప్ర‌తి ఒక్క‌రూ క‌రోనా ప‌రీక్ష‌లో నెగ‌టివ్‌గా తేలిన‌ట్లు ఆయ‌న చెప్పారు. క‌రోనా సోక‌డం వ‌ల్ల ఇంట్లోనే క్వారెంటైన్‌లో ఉన్‌ాట్లు త‌న ట్వీట్‌లో స‌చిన్ వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే.

Related Posts