నల్లగొండ ఏప్రిల్ 2
సహజంగా ఎన్నికల ప్రచారంలో ఓటర్ల వద్ద ప్రాధేయ పడేవారినీ, ప్రలోభ పెట్టె అభ్యర్థులను చూశాం. కానీ ఆ అభ్యర్థి మాత్రం ఓటర్ల వద్ద బోరున ఏడుస్తూ వెరైటీ ప్రచారం చేయడం చర్చనీయాంశంగా మారింది.
నాగార్జున సాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారంలో వేగం పెంచారు. పెద్దగా రాజకీయ అనుభవం లేని బీజేపీ అభ్యర్థి రవినాయక్ వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టాడు. తనకు డబ్బు లేదు, గుండె ధైర్యం లేదు, ఒక్క అవకాశాన్నిచ్చి నన్ను అసెంబ్లీకి పంపియ్య౦డంటూ ఓటర్ల వద్ద కన్నీటి పర్యంత మయ్యాడు రవి నాయక్. ఇలా పలు గ్రామాల్లో తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. మరి రవి నాయక్ కన్నీటి పర్య౦తానికి ప్రజలు చలించిపోతారో లేదో చూడాలి.