హైదరాబాద్ ఏప్రిల్ 2
లింగోజిగూడ డివిజన్ లో ఎల్బీనగర్ నియోజకవర్గ బీజేపీ నాయకులు ప్రజల సమస్యల పై పాదయాత్ర నిర్వహించారు.ప్రతిపక్షంలో గెలిచిన ఎమ్మెల్యే అధికార పక్షం లోకి వచ్చి అభివృద్ధి చేస్తానని ప్రజలను మోసం చేశారని రెండు సంవత్సరాలు లో ఎలాంటి అభివృద్ధి చేయలేదు అని బిజెపి నాయకులు మండిపడ్డారు. పార్టీ మారి పదవులు తీసుకుని ఆయన మాత్రమే అభివృద్ధి చెందారని నియోజకవర్గాన్ని అభివృద్ధి గాలికి వదిలేశారని బిజెపి నాయకులు అన్నారు. లింగోజిగూడ డివిజన్ అభివృద్ధి అస్తవ్యస్తంగా తయారైంది అని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బిజెపికి మరోసారి అవకాశం కల్పిస్తే కేంద్ర నిధులతో అభివృద్ధి చేస్తామని బిజెపి నాయకులు అన్నారు. మోసపూరితమైన వాగ్దానాలతో లింగోజిగూడ ప్రజలను మరోసారి మోసం చేయడానికి ఎమ్మెల్యే,మాజీ కార్పొరేటర్ ప్రయత్నిస్తున్నారని బిజెపి నాయకులు అన్నారు.