వికారాబాద్ ఏప్రిల్ 3,
ప్రాంతీయ రింగ్ రోడ్డు ను వికారాబాద్ జిల్లా మీదుగా ఏర్పాటు చేయాలని, అందుకు తగ్గట్లు వెంబడే డిజైన్ మార్చాలని వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి శనివారం ఒక రోజు దీక్ష చేసారు. మాజీ ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, తాండూరు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి రమేష్ మహరాజ్ వచ్చి అయన కు మద్దతు పలికారు. ఈ సందర్బంగా యాదవ రెడ్డి రామ్మోహన్ రెడ్డికి కి నిమ్మ రసం ఇచ్చి దీక్ష విరమింప చేశారు. రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఈ రింగు రోడ్డు ను వికారాబాద్ మిదిగా ఏర్పాటు చేయుటకు వెంబడే జిల్లా శాసన సభ్యులు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ప్రకటన చెపియ్యాలి అని లేకుంటే మాతో పాటు ప్రజాఉద్యమంలో పాల్గొనాలి అన్నారు.లేదంటే మీకు ప్రతిఘటన తప్పదని అన్నారు.మన జిల్లాకు అన్యాయం చేస్తుంటే మనం చూస్తూ ఊరుకుంటే చరిత్ర హిణులుగా మిగిలి పోతాం అన్నారు. ఈ కార్యక్రమాంలో హనుమంతు ముదిరాజ్,పరిశురాం రెడ్డి,ఎర్రగడ్డపల్లి కృష్ణ,విజయ్ కుమార్ రెడ్డి ,భీంరెడ్డి,ఆంజనేయులు, అనేమ్ ఆంజనేయులు ,శ్రీనివాస్ పవర్ నర్సింహా రావు,సురేందర్ ముదిరాజ్,మల్లేష్ సర్వర్,మైపాల్ , అజాస్ తదితరులు పాల్గోన్నారు.