గూడూరు ఏప్రిల్ 3,
ఈ నెల 17న జరగనున్న తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో గూడూరు నియోజకవర్గం నుండి వైసిపి అభ్యర్థికి 70 వేల ఓట్ల మెజార్టీ ఇవ్వాలని గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు . గూడూరు రెండవ పట్టణ పరిధిలోని ఓ ప్రైవేటు కళ్యాణమండపంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి ఎమ్మెల్యే మరియు వైసీపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు . అనంతరం రోడ్ షో ప్రారంభించారు. స్థానిక బి.సి.కాలనీ , నరసింగరావు పేట ప్రాంతాల్లో ఈ రోడ్ షో సాగింది . బ్యాండ్ మేళాలతో వందలాది మంది కార్యకర్తలు , నాయకులతో వైసిపి నాయకులు రోడ్ షో నిర్వహించారు . ఈ సందర్భంగా గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు . తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థికి అత్యధిక మెజారిటీతో గెలిపించడం ద్వారా వైయస్ జగన్మోహన్ రెడ్డి ద్వారా రాబోవు మూడేళ్లలో మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు ఆశీర్వదించాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు . రాప్తాడు నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో గూడూరు నియోజకవర్గం వైసీపీకి కంచుకోట లాంటిదని తెలిపారు . గూడూరు నియోజకవర్గ ప్రజలు వైసిపి పట్ల ఉన్న ఆదరణను ఈ నెల 17న జరుగు తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిని గెలిపించి మరొకసారి మరొకసారి ఆశీర్వదించాలని ఆయన కోరారు . ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ , వైసిపి నాయకులు గోపాల్ రెడ్డి , మేరిగ మురళి , విజయ్ కుమార్ , జోష్న లత , కల్పన . మీరా రెడ్డి , శ్రీనివాసులు , నాగులు , తదితరులు పాల్గొన్నారు .