మే 5న కేంద్రమంత్రి నితిన్ గడ్కరి హైదరాబాద్ రానున్నారు. రూ.1523 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ ఔటర్ రింగ్రోడ్డు-మెదక్, ఆరంఘర్-శంషాబాద్ 6 లైన్ల రోడ్డు, అంబర్పేట్లో 4 లేన్ల ఫ్లైఓవర్తో పాటు ఉప్పల్లో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనులను నితిన్ గడ్కరి ప్రారంభించనున్నారు.
తెలంగాణ ఏర్పడకముందు రాష్ట్రంలో జాతీయ రహదారుల నిడివి 2647 కిలోమీటర్లు ఉండగా.. ఈ నాలుగేళ్ల మోదీ పాలనలో రాష్ట్రానికి మరో 2656 కిలోమీటర్లు జాతీయ రహదారులు మంజూరయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల్లో ఇవాళ తెలంగాణ 2వ స్థానంలో ఉంది. కేంద్రం ఉదారంగా హైదరాబాద్ చుట్టూ 4 వరుసల రీజినల్ రింగ్ రోడ్డు మంజూరు చేసి, ఇందుకు 4 వేల కోట్ల రూపాయలను కేటాయించింది. అంతేకాదు తెలంగాణలో గ్రామీణ సడక్ యోజన కింద 205 కోట్లతో కేంద్రం రహదారులను అభివృద్ధి చేస్తుంది. ఈ పథకంలో భాగంగా ఇప్పటికే తొలిదశలో రహదారులు, వంతెనల నిర్మాణం చేపట్టారు. హైదరాబాద్-అమరావతి ఎక్స్ప్రెస్ హైవే, హైదరాబాద్-బెంగళూరు ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణానికీ మోదీ ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేసింది.