YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు తెలంగాణ

రెచ్చిపోయిన టీఆర్ఎస్ కార్యకర్తలు

రెచ్చిపోయిన టీఆర్ఎస్ కార్యకర్తలు

హైద్రాబాద్, ఏప్రిల్ 3, 
ఓ టీఆర్ఎస్ కార్యకర్త రెచ్చిపోయాడు. డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్‌పై దాడికి దిగాడు. అది కూడా మహిళా పోలీసులపై తన ప్రతాపం చూపాడు. ఖమ్మంలో నిన్న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.బందోబస్తు విధులు నిర్వర్తిస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్‌పై పై టీఆర్ఏస్ కార్యకర్త దాడి చేసిన ఘటన ఖమ్మం జిల్లాలో నిన్న చోటు చేసుకుంది. కేటీఆర్ పర్యటన కోసం పోలీసులు బందోబస్త్ ఏర్పాటు చేశారు.దీంతో పార్టీలో చేరికల్లో భాగంగా టిఆర్ఏస్ కార్యాలయం వద్దకు భారీగా కార్యకర్తలు చేరుకున్నారు. కేటిఆర్ చేరుకునే సమయంలో పోలిసులు లోపలికి ఎవరిని అనుమతించలేదు. దీంతో ఆగ్రహంతో అక్కడ ఉన్న టీఆర్ఏస్ కార్యకర్త .. మహిళ కానిస్టేబుల్ జ్యోత్స్న పై దాడి చేశారు. దీంతో కానిస్టేబుల్ తలకు బలంగా గాయమైంది. టూటౌన్ సీఐ గోపి అక్కడి చేరుకోని కానిస్టేబుల్ ను అడిగి తెలుసుకున్నారు. కానిస్టేబుల్ ఫిర్యాదు చేస్తే దాడికి పాల్పడిన టిఆర్ఏస్ కార్యకర్తపై కేసు నమోదు చేస్తామని తెలిపారు సీఐ.

Related Posts