YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

దేశానికే ఆదర్శం : మంత్రి ఈటల

 దేశానికే ఆదర్శం : మంత్రి ఈటల

రాష్ట్రంలోని ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేస్తామని తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. గురువారం నాడు మీడియాతో ఆయన మాట్లాడుతూ కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా ఆడపిల్లల పెళ్లిళ్లకు ఆర్థికసాయం అందుతుందన్నారు. నీటిపారుదల ప్రాజెక్టులకు రూపకల్పన చేసి అనుమతులు తెచ్చుకున్నామన్నారు.  అపజయాలు అవమానాలు దిగమింగి గమ్యాన్ని ముద్దాడిన పార్టీ. కెసిఆర్ పిలుపుతో తెలంగాణ ప్రజలు పోరాడి రాష్ట్రాన్ని సాధించుకున్నారు పోరాడిన పార్టీకే ప్రజలు పగ్గాలు అందిచ్చారని అయన అన్నారు.  ప్రభుత్వం ఏర్పడిన తరువాత 5వ ప్లీనరీ. ప్రభుత్వంగా దేశ మన్ననలు పొందినం.  వచ్చేది కాదు చచ్చేది కాదు అన్నారు. అంధకారంలో లో మగ్గుతుంది అన్నారు. హైదరాబాద్ అలకల్లోలం అవుతుందన్నారు. కానీ ఆ విష ప్రచారం చేశారు. కానీ వాటన్నిటినీ తిప్పికొట్టి పటిష్ట పాలన అందించడం మేము సాధించిన విజయం. సన్నబియ్యం పెట్టినం. ఆడపిల్లలను అమ్ముకొనే రోజుల్లో.. గుండేమీద కుంపటి కాదు లక్ష్మి అని కల్యాణలక్ష్మి పెట్టినామని అన్నారు. 

80వేల కోట్లతో కాళేశ్వరం 

చెంచు పేంటలకు మంచినీరు అందిస్తున్నాం. తెరాస కార్యకర్తలు ఏనాడు విశ్రమించలేదు. ప్రతిక్షణం అప్రమత్తంగా ఉన్నారు. ఈ ప్లీనరీ సమావేశాలు భవిష్యత్తుకి దిక్షూచి.   తెలంగాణ ఉన్న పథకాలు దేశవ్యాప్తంగా అమలైతే బాగుంటుంది అని అనుకుంటున్నారు. దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తుంది.  పాస్ లు అందిన ప్రతి ఒక్కరూ మీటింగ్ కు రావాలి. ప్లీనరీ చర్చల్లో పాల్గొనాలని మంత్రి అన్నారు.

Related Posts