YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు దేశీయం

యూపీలో దిశ తరహా రేప్

యూపీలో దిశ తరహా రేప్

లక్నో, ఏప్రిల్ 3, 
సామూహిక అత్యాచారానికి గురైన పదో తరగతి చదువుతోన్న బాలిక ఆత్మహత్యకు పాల్పడిన ఘటన యూపీలోని మీరట్‌లో చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో నలుగురి నిందితుల్లో ఇద్దర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, నిందితులు లఖన్, వికాస్‌లను కోర్టుకు తీసుకెళ్తుండగా ఓ కానిస్టేబుల్ వద్ద నుంచి తుపాకి లాక్కుని తప్పించుకునే ప్రయత్నం చేశాడని పోలీసులు తెలిపారు. కప్సాద్ గ్రామం వద్ద ఇద్దర్నీ అదుపులోకి తీసుకున్నట్టు పేర్కొన్నారు. ఎస్ఐ నుంచి గన్ లాక్కుని పారిపోతున్న నిందితుల కోసం గాలిస్తుండగా.. కాల్పులు జరిపారని అన్నారు. దీంతో తాము ఎదురు కాల్పులు జరిపామని, ఈ ఘటనలో నిందితుడు లఖన్ కాలికి గాయమయ్యిందని మీరట్ రూరల్ ఎస్పీ కేశవ్ కుమార్ వెల్లడించారు. అతడికి స్థానిక ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోందని ఎస్పీ తెలిపారు. అయితే, నిందితులను ఎన్‌కౌంటర్ చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. కానీ, చివరి నిమిషంలో పోలీసులు వెనుకడుగు వేసినట్టు సమాచారం.కస్పాద్ గ్రామానికి చెందిన బాలిక గురువారం సాయంత్రం ట్యూషన్ నుంచి తిరిగొస్తుండగా లఖన్, వికాస్ సహా మరో ఇద్దరు అపహరించి లైంగిక దాడికి తెగబడ్డారు. ఈ అవమానాన్ని తట్టుకోలేక బాలిక విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. అయితే, బాధితురాలి కుటుంబం మాత్రం వారే బలవంతంగా విషం తాగించినట్టు ఆరోపించారు. ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్న ప్రకారం.. గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు ఇంటి నుంచి వెళ్లిన బాధిత బాలిక సాయంత్రం 5.15 గంటలకు తిరిగొచ్చింది. అనంతరం తనపై అత్యాచారం జరిగినట్టు తల్లిదండ్రులకు చెప్పిన బాధితురాలు.. తర్వాత అత్మహత్యాయత్నం చేసింది. ఆమెను కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ గురువారం రాత్రి చనిపోయింది. బాలిక నివాసంలో సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.ఈ ఘటనపై ప్రతిపక్షాలు స్పందిస్తూ.. అధికార బీజేపీపై విమర్శలు గుప్పిస్తున్నాయి. మహిళలు, బాలికలపై రోజు రోజుకూ అఘాయిత్యాలు పెరిగిపోతున్నా యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదని సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేశ్ యాదవ్ దుయ్యబట్టారు

Related Posts