YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

ప్రాజెక్టులపై శ్వేతప్రతం : పొన్నం

 ప్రాజెక్టులపై శ్వేతప్రతం : పొన్నం

ప్లీనరీ నిర్వహిద్దామనుకుంటున్న టిఆర్ఎస్ పార్టీ  హామీలు ఎంతవరకు అమలు చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలి. దళితులకు మూడెకరాల భూమి,ఇంటికో ఉద్యోగం, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం ఎంతవరకు అమలయ్యాయో ప్రజలకు వివరాలివ్వాలని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేసారు. గురువారం నాడు అయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ నిర్మించిన ప్రాజెక్టులకు హెడ్ రెగ్యులేటరీలు కట్టి మొత్తం టిఆర్ఎస్ ఖాతాలో వేసుకుంటున్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే నీరో చక్రవర్తిలా ప్రత్యామ్నాయ ఫ్రంట్ అంటూ బెంగాల్,బెంగుళూరుకు తిరుగుతున్నారని అయన విమర్శించారు. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేనంత రుణ భారం ప్రజలపై మోపడం వాస్తవం కాదా. ప్లీనరీకి హాజరయ్యే టిఆర్ఎస్ కార్యకర్తలు మీ పార్టీ అధికారంలోకి వచ్చాక ఏం సాధించిందో ప్రశ్నించండని అయన అన్నారు. ప్రాజెక్టుల రీ డిజైన్ పేరుతో లక్షల కోట్లు ప్రజాధనం వృధా చేస్తున్నా కెసిఆర్ ను పొగుడుతున్న గవర్నర్ తన పేరును కల్వకుంట్ల నరసింహన్ గా మార్చుకోవాలని అన్నారు.

Related Posts