YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

యువత, రైతు సమస్యలపై పోరాడుతా : జేడీ లక్ష్మినారాయణ

యువత, రైతు సమస్యలపై పోరాడుతా : జేడీ లక్ష్మినారాయణ

సిబిఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ గురువారం నాడు జిల్లాలోని వెల్లలూరుకు వచ్చారు. అంబటి లక్ష్మణరావు కుమారుడు రామలింగేశ్వరరావు, జెడి లక్ష్మీ నారాయణ మిత్రులు  అవటంతో అయన వెల్లలూరు వచ్చారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా వస్తేనే యువతకి ఉపాధి అవకాశాలు దక్కుతాయని అన్నారు. గ్రామాల్లో పనిచేసి రైతులకు సేవ చేస్తానని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకున్నా. పోలీస్ డిపార్ట్ మెంట్ లో పనిచేస్తున్నావు.  గ్రామాలు అభివృద్ధి ఎలా చేస్తావని హేళన చేశారని అయన అన్నారు. అందుకే ఉద్యోగానికి రాజీనామా చేసి గ్రామాలలో సేవ చేయాలనే బాట పట్టాను. మార్పుకు  నాంది పలకాలి. రైతులతో మాట్లాడి వారి కష్టసుఖాలు తెలుసుకొని     ముందుకు నడవాలనే ఇక్కడి నుంచి మొదలు పెట్టానని అన్నారు. ఆనందం, ధైర్యం తో దేశప్రజలకు అన్నం పెట్టగలుగుతున్న వాడు రైతు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్ ఏటా రెండుసార్లు వస్తుంది...అన్నదాతకు ఇంక్రిమెంట్లు లేవు. రైతులందరిని ఓకేతాటి పైకి తెచ్చే ప్రయత్నం చేస్తే చాలా మంది అడ్డుకున్నారని అన్నారు. మహారాష్ట్రాల్లో రైతులు సంఘటితంగా పోరాడి సమస్యలు సాధించుకునే ప్రయత్నం చేస్తున్నారు. వేలాది మంది రైతులు ముంబయ్ కి తరలి వచ్చారని గుర్తు చేసారు. రాజకీయాలలో చేరే ఉద్దేశం లేదు. ఉంటే ముందుగా మీడియా కె చెబుతా.  సమాజంలో ఉన్న సమస్యలు, రైతులు, యువత సమస్యలపై పోరాటం చేస్తానని అయన అన్నారు.

Related Posts