YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం దేశీయం

మహారాష్ట్ర హోమ్ మంత్రి రాజీనామా

మహారాష్ట్ర హోమ్ మంత్రి రాజీనామా

బార్లు, రెస్టారెంట్ల నుంచి నెలకు రూ.100 కోట్లు వసూలు చేయాలంటూ పోలీసు అధికారులకు హోంమంత్రి టార్గెట్ ఇచ్చారని ముంబయి మాజీ సీఎ పరమ్‌బీర్‌ సింగ్‌ ఆరోపించిన విషయం తెలిసిందే.మహారాష్ట్ర రాజకీయాల్లో సోమవారం అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు పంపారు. హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై ముంబయి మాజీ పోలీస్ కమిషనర్ పరమ్‌బీర్ సింగ్ చేసిన అవినీతి ఆరోపణలకు సంబంధించిసీబీఐ విచారణకు బాంబే హైకోర్టు ఆదేశించిన కొద్ది సేపటికే ఆయన రాజీనామా చేయడం గమనార్హం. అనిల్ దేశ్‌ముఖ్ వ్యవహారంపై పదిహేను రోజుల్లోగా దర్యాప్తు పూర్తిచేయాలని హైకోర్టు స్పష్టం చేసిన విషయం తెలిసిందే.అవినీతి ఆరోపణలకు సంబంధించి ఏమైనా ఆధారాలు లభిస్తే ఎఫ్ఐఆర్ నమోదుచేయాలని బాంబే హైకోర్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో హోంమంత్రి తన పదవికి రాజీనామా చేశారు. సీబీఐ విచారణకు కోర్టు ఆదేశించడంతోనే తాను రాజీనామా చేసినట్టు అనిల్ దేశ్‌ముఖ్ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. అనిల్ దేశ్‌ముఖ్ రాజీనామాపై ఎన్‌సీపీ నేత, మంత్రి నవాబ్ మాలిక్ స్పందించారు. దర్యాప్తునకు కోర్టు ఆదేశించడంతో పదవిలో కొనసాగాలని భావించలేదన్నారు.'హైకోర్టు ఆదేశాల తర్వాత శరద్ పవార్‌, ఎన్‌సీపీ నేతలను కలిసిన హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ పదవిలో కొనసాగడం తనకు ఇష్టంలేదని అన్నారు.. తాను రాజీనామా లేఖను ముఖ్యమంత్రికి అందజేయడానికి వెళ్లారు.. ఆయన రాజీనామాను ఆమోదించాలని పార్టీ కూడా అభ్యర్థించింది' అని నవాబ్ మాలిక్ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, సాక్షాత్తూ పోలీస్ బాస్ మంత్రిపై ఆరోపణలు చేయడాన్ని అసాధారణమైన, అపూర్వమైనదిగా బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ జీఎస్ కులకర్ణిల ధర్మాసనం అభిప్రాయపడింది

Related Posts