YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

నేరాలు తెలంగాణ

ఫేక్ జీవో... అరెస్ట్

ఫేక్ జీవో... అరెస్ట్

లంగాణలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రాత్రిపూట లాక్‌డౌన్ విధించనుందంటూ సోషల్‌మీడియాలో ఫేక్ ప్రచారం చేసిన వ్యక్తిని హైదరాబాద్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లాక్‌డౌన్‌ విధిస్తూ ప్రభుత్వం ప్రకటన జారీ చేసిందంటూ ఫేక్ జీవో వైరల్‌గా మారింది. దీనిపై ప్రజల్లో గందరగోళం నెలకొనడంతో అధికారులు క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారమంతా అసత్యమని, అలాంటి రూమర్లను ఎవరూ నమ్మెుద్దని సూచించారు. అయితే ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు నిందితుడిని మూడు రోజుల్లోనే గుర్తించారు.హైదరాబాద్‌లో చార్టెడ్ అకౌంటెంట్‌గా పనిచేస్తున్న నెల్లూరు జిల్లాకు చెందిన శ్రీపతి సంజయ్ కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు వివరాలను సోమవారం మీడియాకు వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్.. నిందితుడిపై సైబర్ నేరాల చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. శ్రీపతి సంజీవ్ కుమార్ ఏప్రిల్ 1న ఆన్‌లైన్ నుంచి తెలంగాణ ప్రభుత్వ జీవో ఒకదానిని డౌన్‌లోడ్ చేసుకుని దాన్ని మార్ఫింగ్ చేసి సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేసినట్లు వెల్లడించారు. ఫేక్ జీవోలతో ప్రజలను తప్పుదోవ పట్టించేలా వ్యవహరించేవారిపై కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.సోషల్‌ మీడియాలో వచ్చేవి న్యూస్ నిజమా? కాదా? అని బేరీజు వేసుకున్నాకే నెటిజన్లు దాన్ని ఫార్వార్డ్ చేయాలని, తెలిసీతెలియకుండా వచ్చింది వచ్చినట్లు షేర్ చేసేస్తే చిక్కుల్లో పడే అవకాశముందని సీపీ సూచించారు. పోలీస్ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌కు చెందిన ఓ ఫేక్ జీవోను కూడా ఇటీవల వైరల్ చేశారని, దాని బాధ్యులపైనా చర్యలు

Related Posts