YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం దేశీయం

యడ్డీకి ఊరట

యడ్డీకి ఊరట

భూకుంభకోణం కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పకు సుప్రీంకోర్టులో సోమవారం ఊరట లభించింది. పదేళ్ల కిందట భూకుంభకోణానికి సంబంధించిన కేసులో కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సర్వోన్నత న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. 24 ఎకరాల ప్రభుత్వ భూమిని అక్రమంగా ప్రైవేట్ వ్యక్తులకు దారాధత్తం చేశారని యడియూరప్పపై ఉన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ ఆరోపణలపై 2012లో లోకాయుక్త ఛార్జిషీట్ సైతం దాఖలు చేసింది. దీనిని ఆధారంగా చేసుకొనే ముందుకు సాగాలని ప్రత్యేక కోర్టును హైకోర్టు గత నెలలో ఆదేశించింది.ప్రత్యేక న్యాయస్థానం 2016లో ఈ కేసును పక్కనబెట్టగా. దీనిపై బెంగళూరుకు చెందిన అలమ్ పాషా అనే వ్యక్తి హైకోర్టు ఆశ్రయించారు. దీంతో లోకాయుక్త ఛార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకుని విచారణ పునఃప్రారంభించాలని కర్ణాటక హైకోర్టు సూచించింది. హైకోర్టు ఆదేశాలను యడియూరప్ప సవాల్ చేశారు. ఉత్తర్వులపై స్టే విధించాలని కోరారు. దీనిని విచారించిన సుప్రీంకోర్టు.. హైకోర్టు ఆదేశాలను నిలిపివేసింది.అయితే, ముఖ్యమంత్రి హోదాలో యడియూరప్ప అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని లోకాయుక్త తన ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. పారిశ్రామిక ప్రయోజనాల కోసం కేటాయించిన భూములను అక్రమంగా వెనక్కు తీసుకున్నట్టు ఆరోపించింది., హార్డ్‌వేర్ పార్క్ ఏర్పాటు కోసం కర్ణాటక ప్రభుత్వ పారిశ్రామిక అభివృద్ధి బోర్డు నుంచి 2006లో 24 ఎకరాలను భూములను తీసుకున్నారు. కానీ, దీనిని ప్రయివేట్ వ్యక్తులకు అప్పగించినట్టు ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ అంశంపై లోకాయుక్త పోలీసులు కేసు నమోదుచేసి విచారణ జరిపారు. మొత్తం 9 మందిపై కేసు నమోదు చేసినా.. ఆధారాలు లేవని నివేదికలో పేర్కొన్నారు. కానీ, యడియూరప్ప, మాజీ మంత్రి కట్టా సుబ్రమణ్యనాయుడికి వ్యతిరేకంగా మాత్రం ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు.

Related Posts