YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

క్లీన్ స్వీప్ కు టీడీపీ చేదోడు..వాదోడు

క్లీన్ స్వీప్ కు టీడీపీ చేదోడు..వాదోడు

గుంటూరు, ఏప్రిల్ 6, 
నిజమే.. టీడీపీలో ఇప్పుడు అదే ధీమా కన్పిస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికల రిజల్ట్ చూసి భయపడాల్సన పనిలేదంటుంది. తిరుపతి ఉప ఎన్నికల్లో గెలవకపోయినా పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదంటుంది. జగన్ ఈ రిజల్ట్ చూసి అంతా తన ఇమేజ్ అని, సంక్షేమ పథకాల ప్రభావం అన్న భ్రమల్లో ఉండటమే మేలని టీడీపీ అధినేత చంద్రబాబు భావిస్తున్నారు. తిరుపతి ఉప ఎన్నిక తర్వాత రాష్ట్రంలో మరే ఎన్నికలు ఉండవు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు వచ్చినా అది అధికార వైసీపీకే అనుకూలంగా ఉంటుంది.అయినా చంద్రబాబు లో ధీమా తగ్గలేదు. గతంలో చంద్రబాబు కూడా నంద్యాల ఉప ఎన్నిక రిజల్ట్ చూసి భ్రమించారు. ఆ తర్వాత కాకినాడ కార్పొరేషన్ ను కూడా టీడీపీ కైవసం చేసుకుంది. దీంతో నంద్యాల ఫార్ములా అంటూ చంద్రబాబు అప్పట్లో ఊదరగొట్టేశారు. కానీ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూసుకుంటే చంద్రబాబుకు సినిమా కన్పించింది. ఇదే పరిస్థితి జగన్ కు కూడా రాకమానదన్న అంచనాలో టీడీపీ నేతలున్నారు.అందుకే చంద్రబాబు తనపై కేసులు పెట్టినా పెద్దగా యాగీ చేయలేదు. సింపుల్ గా కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. స్థానికసంస్థల ఎన్నికల ఫలితాలు ఎప్పుడూ అధికార పార్టీ కి అనుకూలంగా ఉంటాయి. పైగా అనేక చోట్ల బెదిరింపులు చేసి నామినేషన్లు వేయించలేదు. అలాగే పథకాలను నిలిపేస్తామని బెదిరింపులు కూడా చేశారు. ఈ నేపథ్యంలోనే తమ పార్టీ నేతలు ఎక్కువ చోట్ల విజయం సాధించలేకపోయారని చంద్రబాబు అంచనా వేస్తున్నారు.టీడీపీ ఓటు బ్యాంకు ఇప్పటికే ఏపీలో చెక్కు చెదరలేదని చంద్రబాబు ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. సీఐడీ కేసు తనపై నమోదు అయినా చంద్రబాబు వెంటనే మీడియా ముందుకు రాలేదు. పార్టీ నేతలు, శ్రేణులే చంద్రబాబు కేసుపై స్పందించాయి. రోడ్డు మీదకు వచ్చాయి. ఇలా జగన్ అనుసరిస్తున్న విధానాలతోనే తిరిగి తమకు పట్టు దొరుకుతుందని చంద్రబాబు భావిస్తున్నారు. తిరుపతి ఉప ఎన్నిక ఫలితం ఎలా ఉన్నా రానున్న రోజులన్నీ తమకు అనుకూలంగానే ఉంటాయని చంద్రబాబు అంచనా వేస్తున్నారు. మరి ఏం జరుగుతుందనేది చూడాల్సి ఉంది.

Related Posts