YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

షర్మిలకు వామ్ అప్...

షర్మిలకు వామ్ అప్...

హైదరాబాద్, ఏప్రిల్ 6, 
వైఎస్ షర్మిల మరి కొద్ది రోజుల్లో పార్టీని ప్రకటించ బోతున్నారు. అయితే వైఎస్ షర్మిల గత రెండు నెలలుగా చేస్తున్న కసరత్తులో ఎక్కువగా రెండు జిల్లాల నుంచే రెస్పాన్స్ ఎక్కువగా ఉంది. ఖమ్మం, నల్లగొండ జిల్లాల నుంచి ఎక్కువగా కార్యకర్తలు వైఎస్ షర్మిల సమావేశాలకు రావడం, అక్కడ పార్టీ బలోపేతం అయ్యేందుకు ఎక్కువ అవకాశాలు కన్పిస్తున్నాయి. తెలంగాణలోని ఉమ్మడి పది జిల్లాల్లో వైఎస్ షర్మిల ప్రభావం ఎక్కవగా ఈ రెండు జిల్లాల్లోనే ఉండనుంది.వైఎస్ షర్మిల పార్టీ పెట్టడం ఒక సంచలనమే. ఆంధ్రప్రదేశ్ ను ఎంచుకోకుండా తెలంగాణను ఎంచుకోవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. వామప్ కోసమే వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ పెడుతున్నారంటూ జేసీ దివాకర్ రెడ్డి వంటి నేతలు చేసిన వ్యాఖ్యలు తోసిపుచ్చలేం. బలం లేని చోట, అవకాశాలు అతికొద్దిగా ఉన్న చోట వైఎస్ షర్మిల పార్టీ పెట్టడమంటే ఆలోచించాల్సిన విషయమేనంటున్నారు విశ్లేషకులు.అయితే వైఎస్ షర్మిల కొత్త పార్టీ వెనక ఎవరున్నారన్నది పక్కన పెడితే ఇప్పుడు ఆమె పార్టీ ఖమ్మం జిల్లాపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టినట్లు కన్పిస్తుంది. తొలినుంచి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కు కొంత అనుకూలంగా ఉండేది. వైఎస్ హయాం నుంచే ఖమ్మం నుంచి కాంగ్రెస్ కు ఎక్కువ సీట్లు వచ్చాయి. 2014 ఎన్నికల్లో సయితం వైసీపీకి ఒక ఎంపీ సీటు, మూడు ఎమ్మెల్యే సీట్లు ఖమ్మం జిల్లా నుంచే రావడం విశేషం. ఆంధ్ర సరిహద్దుల్లో ఉన్న ఈ జిల్లాలో అందుకే వైస్ షర్మిల ఫోకస్ పెట్టారంటున్నారు.ఇక ఖమ్మం జిల్లాలోనే వైఎస్ షర్మిల భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇతర పార్టీల్లో ఉన్న ఖమ్మం జిల్లా నేతలు కొందరు ఈ సభలో వైెఎస్ షర్మిల పార్టీలో చేరే అవకాశాలు కన్పిస్తున్నాయి.వైఎస్ షర్మిల కూడా తాను పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ కాంగ్రెస్ బలంగా ఉండటం, వైఎస్ అభిమానులు, రెడ్డి సామాజికవర్గం ఎక్కువగా ఉండటంతో ఈ నియోజకవర్గంపై వైఎస్ షర్మిల దృష్టి పెట్టారంటున్నారు. మొత్తం మీద వైఎస్ షర్మిల తన స్టామినాను ఈ జిల్లా నుంచి చూపించాలనుకుంటున్నారు.
సెటిల్మెంట్ లో భాగమేనా
రాజకీయాల్లో కొన్ని ఆసక్తికరపరిణామాలు ఎందుకు జరుగుతున్నాయో… అంచనా వేయడం కష్టం. అలాంటి వాటిలో ఒకటి… రాయలసీమకు చెందిన షర్మిల తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేసి.. రాజన్న రాజ్యం తీసుకు వస్తామని ప్రకటించడం. తెలంగాణకు బద్ద వ్యతిరేకి అయిన వైఎస్ కుమార్తె అంత దర్జాగా తెలంగాణలో రాజకీయం చేయగలగడమే ఓ విశేషం అయితే.. ఎంతో పట్టు ఉన్న ఏపీలో కాకుండా… తెలంగాణకు ఎందుకు వచ్చిందన్నది మరో ప్రశ్న. వీటన్నింటికీ రకరకాల సమాధానాలు వస్తూ ఉంటాయి. కానీ క్యాచీగా ఉండేవి మాత్రం కొన్నే. అన్నతో విబేధించి.. తెలంగాణలో షర్మిల పార్టీ పెట్టిందని చాలా మంది చెబుతూ ఉంటారు కానీ.. అన్నతో విబేధిస్తే… ఏపీలో పెట్టుకోవాలి కానీ తెలంగాణలో పెట్టుకుంటారా అన్నది ప్రధానమైన సందేహం. ఈ చర్చల్లోకి జనసేన నేత పోతిన మహేష్ అంశం తీసుకు వచ్చారు. అసలు షర్మిల తెలంగాణకు ఎందుకు వచ్చారంటే… జగన్మోహన్ రెడ్డి ఆస్తులన్నీ పంచేశారని…అందులో భాగంగా ఏపీని .. తనకు అంటే… జగన్‌కు.. తను జైలుకెళ్తే భారతికి వదిలేయాలని… షర్మిలకు తెలంగాణ అప్పగించాలని ఒప్పందాలయ్యాయట. ఈ విషయాన్ని పోతిన మహేష్ చెబుతున్నారు. నిజంగా అంతర్గత సమాచారం అందిందో లేదో .. పవన్ కల్యాణ్‌ను.. అదే పనిగా వైసీపీ నేతలు విమర్శిస్తున్నారని ఇలా కౌంటర్ ఇచ్చారో కానీ… ఇదేదో లాజికల్‌గానే ఉందని రాజకీయవర్గాలు చెబుతున్నాయి. జగన్‌తో విబేధాలు వస్తే షర్మిల అన్నకు వ్యతిరేకంగా మాట్లాడాలి. కానీ ఇక్కడ ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. ఆస్తుల పంపకం గురించి కూడా ఆమె ఎలాంటి వ్యాఖ్యలు చేయడం లేదు. మొత్తంగా చూస్తే.. ఆస్తుల విషయంలో జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వివాదాలు రాకుండా సెటిల్ చేసుకున్నారని.. రాజకీయ పరంగా.. .వైసీపీలో చోటివ్వడం కష్టం కాబట్టి.. తెలంగాణ రాసిచ్చేశారని.. భవిష్యత్‌లో అక్కడ.. వైసీపీ అడుగు పెట్టబోదని హామీ ఇచ్చి పంపించారని అంటున్నారు. పంపకాల్లో భాగంగా పెద్ద ఎత్తున మనీ రావడంతోనే.. వైసీపీ తరహాలో రాజకీయాలను షర్మిల చేస్తున్నారంటున్నారు. పార్టీలో చేరే కొంత మంది ప్రముఖ నేతలకు ఆర్థిక సాయం ఆఫర్ చేస్తున్నారన్న చర్చ ఇప్పటికే తెలంగాణలో జరుగుతోంది.

Related Posts