YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

నేటి నుంచి ఈ నెల 30వ తేదీ వ‌ర‌కు..ఢిల్లీ లో నైట్ క‌ర్ఫ్యూ

నేటి నుంచి ఈ నెల 30వ తేదీ వ‌ర‌కు..ఢిల్లీ లో నైట్ క‌ర్ఫ్యూ

న్యూఢిల్లీ ఏప్రిల్ 6
 ‌దేశ రాజ‌ధాని ఢిల్లీలో క‌రోనా విల‌య తాండ‌వం చేస్తోంది. ఈ నేప‌థ్యంలో క‌రోనా నియంత్ర‌ణ‌కు ఢిల్లీ ప్ర‌భుత్వం ప‌క‌డ్బందీ చ‌ర్య‌లు తీసుకుంటోంది. క‌రోనా మ‌హ‌మ్మారి నియంత్ర‌ణ‌కు త‌క్ష‌ణ‌మే నైట్ క‌ర్ఫ్యూ అమ‌లు చేయాల‌ని ఢిల్లీ ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. నేటి నుంచి ఈ నెల 30వ తేదీ వ‌ర‌కు.. రాత్రి 10 గంట‌ల నుంచి తెల్ల‌వారుజామున 5 గంట‌ల వ‌ర‌కు నైట్ క‌ర్ఫ్యూ కొన‌సాగ‌నుంది.ఢిల్లీలో ఫోర్త్ వేవ్ కొన‌సాగుతోంద‌ని, లాక్‌డౌన్‌పై ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేద‌ని ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ ఇటీవ‌లే ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ప్ర‌జ‌ల నుంచి స‌ల‌హాలు, సూచ‌న‌లు స్వీక‌రించిన త‌ర్వాతే లాక్‌డౌన్‌పై నిర్ణ‌యం తీసుకుంటామ‌న్నారు. ఢిల్లీలో సోమ‌వారం ఒక్క‌రోజే కొత్త‌గా 3,548 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, 15 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఒక్క‌రోజే దేశ వ్యాప్తంగా 96 వేల‌కు పైగా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి.

Related Posts