ల్లగొండ ఏప్రిల్ 6
నాగార్జున సాగర్ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా భునవగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంగళవారం మాడుగుల పల్లి మండలంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జానారెడ్డికి ప్రజల మద్దతు ఉందని, ఇది చూడలేకనే టీఆర్ఎస్ బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించారు. పక్క జిల్లాల నుంచి వచ్చి బెదిరింపులకు పాల్పడితే దెబ్బకు దెబ్బ తీస్తామన్నారు. రూ. 200 కోట్లు ఉన్న వాణిని ఎమ్మెల్సీగా చేసిన సీఎం కేసీఆర్.. తెలంగాణ కోసం ప్రాణ త్యాగం చేసిన శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మను ఎమ్మెల్సీగా ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వారి నియోజక సమస్యలను గాలికి వదిలి నాగార్జునసాగర్లో డబ్బు మూటలతో తిరుగుతున్నారని ఆరోపించారు. 2019 ఎంపీ ఎన్నికల్లో సొంత బిడ్డను గెలిపించుకోలేని కేసీఆర్ నాగార్జున సాగర్లో వారి అభ్యర్ధిని ఎలా గెలిపిస్తారని కోమటిరెడ్డి అన్నారు.