అమరావతి
ఆంధ్రప్రదేశ్లో జరగాల్సిన పరిషత్ ఎన్నికలకు బ్రేక్ పడింది. రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను నిలిపివేస్తూ ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తెదేపా వేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం.. పరిషత్ ఎన్నికల ప్రక్రియను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది..