హైదరాబాద్, ఏప్రిల్ 7,
టీఆర్ఎస్ఎల్పీలో టీడీపీ శాసనసభ పక్షం విలీనమైంది. టీడీపీ శాసనసభ పక్షాన్ని టీఆర్ఎస్ఎల్పీలో విలీనం చేయాలని ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, మెచ్చా నాగేశ్వర్రావు బుధవారం శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని కలిసి లేఖ అందించారు.సత్తుపల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన సండ్ర వెంకట వీరయ్య కొన్నాళ్ల తరువాత టీఆర్ఎస్లో చేరారు.అశ్వారావుపేట ఎమ్మెల్యేగా మెచ్చా నాగేశ్వర్ రావు ఒక్కరే టీడీపీ నుంచి అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహించారు. ఆయన సైతం టీడీపీకి రాజీనామా చేశారు.త్వరలో టీఆర్ఎస్లో చేరనున్నట్లు ప్రకటించారు. ఈ విషయంపై ఆయన సీఎం కేసీఆర్తో సైతం భేటీ అయ్యారు. శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితోనూ భేటీ అయ్యారు.అనంతరం సండ్ర వెంకట వీరయ్యతో కలిసి టీడీపీని టీఆర్ఎస్ఎల్పీలో విలీనం చేయాలని స్పీకర్కు లేఖ అందించారు.దీంతో టీడీఎల్పీ విలీనంపై శాసనసభ కార్యదర్శి నర్సింహాచారి అధికారిక బులిటెన్ జారీ చేశారు. ఈ పరిణామంతో అసెంబ్లీలో టీడీపీ ప్రాతినిధ్యం పోయింది.