YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

తిరుపతి ప్రచారానికి జగన్

తిరుపతి ప్రచారానికి జగన్

తిరుపతి, ఏప్రిల్ 7, 
ఏపీలో తిరుపతి ఉప ఎన్నిక హీట్ పెంచుతోంది. వైఎస్సార్‌సీపీ, టీడీపీ, బీజేపీ సహా ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో నిమగ్నమయ్యాయి. పవన్ కళ్యాణ్ శనివారం నగరంలో పాదయాత్ర నిర్వహించారు.. సభలో పాల్గొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా గురువారం నుంచి ప్రచారానికి వెళ్లనున్నారు. వైఎస్సార్‌సీపీ మాత్రం మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఇదిలా ఉంటే ముఖ్యమంత్రివైఎస్ జగన్ కూడా తిరుపతి ప్రచార బరిలోకి దిగబోతున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.ఈ నెల 14న తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొంటున్నట్లు జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో కూడా చర్చ జరుగుతోంది. కొంతమంది వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు కూడా ఈ విషయంపై ట్వీట్ చేశారు.. రావడం పక్కా అంటున్నారు. అంతేకాదు తిరుమల, తిరుపతిలో తాజా పరిణామాలతో జగన్ కూడా ప్రచారానికి రావాలని భావిస్తున్నారని.. హిందూ ధర్మరక్షణకు కట్టుబడి ఉన్నానని చెప్పే ప్రయత్నంలో ఉన్నట్లు సమాచారం. అందుకే ఆయన క్యాంపెయినింగ్‌కు వస్తున్నారని చెబుతున్నారు. అయితే దీనిపై పార్టీ నుంచి అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు.

Related Posts