YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

మల్లారెడ్డిపై సీఎం గుస్సా

మల్లారెడ్డిపై సీఎం గుస్సా

హైదరాబాద్, ఏప్రిల్ 8, 
తెలంగాణ కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ఓ రియల్ ఎస్టేట్ మధ్యవర్తితో బెదిరింపులకు పాల్పడినట్లు ఓ ఆడియో టేప్ వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే, ఈ బెదిరింపు ఆడియోలో ఉన్నది తన గొంతు కాదని, నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని మల్లారెడ్డి స్పందించారు. అయితే, ప్రస్తుతం ఇప్పుడు ఈ వ్యవహారంలో ఆడియోపై అంతర్గత విచారణ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. గొంతు తనది కాదని మంత్రి వాదిస్తున్నప్పుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని టీఆర్ఎస్ అధిష్ఠానం ప్రశ్నించినట్టు తెలుస్తోంది. దీంతో పార్టీ పెద్దల వద్ద మల్లారెడ్డి మిన్నకుండిపోయినట్లుగా టీఆర్ఎస్ వర్గాలు చెప్పాయి.అయితే, ఈ వ్యవహారంలో నిజనిర్ధారణ జరిగిన తర్వాతే మంత్రి మల్లారెడ్డిపై చర్యలు తీసుకోవాలన్న ఆలోచనలో అధిష్ఠానం ఉన్నట్లు తెలుస్తోంది. అది కూడా నాగార్జున సాగర్ ఎన్నికల తర్వాతే జరిగే అవకాశం మెండుగా ఉంది. ఎందుకంటే ఇప్పటికిప్పుడు మంత్రిపై ఎలాంటి చర్యలు తీసుకున్నా మంత్రి తప్పు చేసినట్లు పార్టీనే తేటతెల్లం చేసినట్లవుతుంది. అంతేకాక, అది సాగర్ ఎన్నికలపై ప్రభావం చూపుతుందని కేసీఆర్ భావిస్తున్నారని సమాచారం.ఓ లేఅవుట్‌లో వాటా కావాలంటూ మంత్రి మల్లారెడ్డి బెదిరించినట్లుగా ఓ ఆడియో రాష్ట్ర వ్యాప్తంగా వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలోని శామీర్‌పేట్‌ మండలంలో దాదాపుగా 50 ఎకరాలకు పైగా భూమిలో వాసవి గ్రూపు రియల్‌ ఎస్టేట్‌ సంస్థ వెంచర్‌ చేసింది. ఈ వెంచర్‌లో తమకు వాటా ఇవ్వాల్సిందేనని సర్పంచ్‌ భర్తతో మంత్రి మల్లారెడ్డి మాట్లాడినట్లుగా ఆడియో టేపు వైరల్‌ అవుతోంది. సర్పంచ్‌కు వాటా ఇస్తే మాకేది అంటూ మంత్రి బెదిరించినట్లుగా అందులో ఉంది. తమకు వాటా వచ్చేవరకు వెంచర్‌ను ఆపాల్సిందిగా మంత్రి ఆ ఆడియో టేప్‌లో హుకుం జారీ చేశారు.

Related Posts