YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

నెల్లూరులో పోలింగ్ ప్రశాంతం

నెల్లూరులో పోలింగ్ ప్రశాంతం

నెల్లూరు
నెల్లూరు జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ  ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగాయి.  ఉదయం నుంచే ఓట్లు వేసేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. కావలి మండలం ఆమదాలదిన్నె పోలింగ్ కేంద్రం వద్ద ఓట్లు వేసేందుకు ఓటర్లు క్యూ కట్టారు. కావలి డివిజన్ లోని 9 మండలాల్లో ఎంపీటీసీ  అభ్యర్థులు 126 మంది బరిలో ఉండగా 25 ఇనామస్ అవటంతో 101మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.  అలానే  జడ్పీటీసీ C అభ్యర్థులు 9 మంది ఉండగా ఇద్దరు ఇనామస్ కావటంతో 7 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బాయికాట్ చేయటంతో కొన్ని కేంద్రాలలో ఏజెంట్స్ కూడా ఒకరు ఇద్దరు తో ఎన్నికలు నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొంది.  కోవూరు నియోజకవర్గం  ఐదు  మండలాల్లోని బుచ్చిరెడ్డిపాలెం, కోవూరు కొడవలూరు, విడవలూరు, ఇందుకూరుపేట లో ఉదయం మందకోడిగా పోలింగ్  మొదలైంది. నియోజకవర్గం లో ఐదు జడ్పిటిసి లకు బుచ్చిరెడ్డిపాలెం ఏకగ్రీవం కాగా, 4 మండలాలకు  జడ్పిటిసి లకు పోటీ జరుగనుంది. ఎంపీటీసీ 78 స్థానాలు అందులో 12 ఏకగ్రీవం కాగా  66 ఎంపిటిసి లకు ఎలక్షన్ జరగనుంది.ఓటర్ల కు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు తగిన జాగ్రత్తలు చేపట్టారు.

Related Posts