YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

రెండో డోసు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న ప్రధాని మోడీ

రెండో డోసు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న ప్రధాని మోడీ

న్యూఢిల్లీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గురువారం కొవిడ్-19 వ్యాక్సిన్ రెండో డోసు తీసుకున్నారు. ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇనిస్ట్యూట్ ఆఫ్ మెడికల్ లో టీకా వేయించుకున్నారు. ఈ రోజు  పంజాబ్కు చెందిన నర్సు నిషా శర్మ, పుదుచ్చేరికి చెందిన నర్సు పీ నివేద ప్రధానికి  టీకా వేసారు.  ఈ అవకాశం రావటం తమ జీవితంలో గుర్తుండిపోయే క్షణంగా పేర్కొన్నారు నర్సులు. ప్రధానితో ఫోటోలు తీసుకున్నామని అన్నారు. రెండో డోసు తీసుకున్నట్లు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు మోదీ. తొలి డోసు అయన 37 రోజుల క్రితం తీసుకున్నారు.  మరోవైపు, గడచిన ఇరవై నాలుగు గంటల్లో దేశంలో 1,26,789 కరోనా కేసులు నమోదయ్యాయి.  ఒక్క రోజులో 685 మరణాలు సంభవించాయి.

Related Posts