రాజోలు
తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం పెదపట్నంలంక - సత్తెమ్మ పేటలో వైయస్సార్సిపి, జనసేన కార్యకర్తల మద్య ఘర్షణ చెలరేగింది. ఈ ఘటనల నలుగురు వైయస్సార్ సిపి కార్యకర్తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని రాజోలు ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు. జనసేన ఎంపీటీసి అభ్యర్థి తరపున ఓటర్లకు డబ్బులు పంచేందుకు వచ్చిన జనసేన కార్యకర్తలను అడ్డుకున్నామని వైయస్సార్ సిపి కార్యకర్తలు అంటున్నారు. దీంతో వైయస్సార్ సిపి కార్యకర్తలపై రాళ్ళతో జనసేన కార్యకర్తలు దాడిచేశారని వైసిపి కార్యకర్తలు ఆరోపించారు.