విజయనగరం
సీతానగరం మండలం అంటి పేట ఎం.పి.టి.సి. స్థానానికి సంబంధించి బ్యాలెట్ పత్రంలో అభ్యర్థి పేరు తప్పుగా నమోదు కావడంతో అక్కడ ఈ నెల 9న రీ పోలింగ్ జరుగుతుందని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా ఎం. హరి జవహర్ లాల్ వెల్లడించారు.
అంటిపేట లో పోటీ చేస్తున్న వై.సి.పి. అభ్యర్థి శనపతి నిర్మల కు బదులుగా పోటీ నుంచి విరమించిన శనపతి లక్ష్మి పేరు పోటీ చేస్తున్న అభ్యర్థుల జాబితా ఫామ్-9 లో పొరపాటున వచ్చింది. దాంతో 20, 21, 22 నంబరు పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ వాయిదా వేసినట్లు కలెక్టర్ తెలిపారు.