YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ఎన్నికల ప్రచారంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్

ఎన్నికల ప్రచారంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్

నల్గోండ
రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి  శ్రీనివాస్ గౌడ్ గారు నాగార్జున సాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా తెరాస పార్టీ అభ్యర్థి  నోముల భగత్ కు మద్దతు గాగురువారం నాడు  నిడుమనూరు మండలం ఊట్కూరు, గోపవారి గూడం, నందికొండ వారి గూడం, లక్ష్మపురం గ్రామాల్లో  పర్యటించారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ శాసన సభ్యుడు భాస్కరరావు, మాజీ ఎంపీ బూర నర్సయ్య, పార్టీ అభ్యర్థి  నోముల భగత్, పార్టీ కార్యకర్తలు పాల్గోన్నారు.  వారికి  ఊట్కూరు గ్రామంలో మహిళలు, యువకులు, కోలాటాలతో, బతుకమ్మ లతో మహిళలు, గీత కార్మికులు ముస్తాదులతో గ్రామంలో లోకి ఘన స్వాగతం పలికి పెద్ద ఎత్తున మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ గారు బడుగు బలహీన వర్గాల ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం అనేక పథకాలు ను అమలు చేస్తున్నారు. కుల వృత్తులకు పూర్వ వైభవాన్ని తీసుకువస్తున్నారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో కల్లు దుకాణాలను రద్దు చేసి , కల్లు ను రాష్ట్రంలో నిషేధించాలని కుట్ర చేసి గౌడ్ ల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసారన్నారు. రైతు బంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మి, షాది ముబారక్, పెన్షన్లు ను అమలు చేస్తున్న దేశంలోనే ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అన్నారు. నాగార్జున సాగర్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో  పార్టీ అభ్యర్థి  నోముల భగత్ ను  అఖండ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

Related Posts