YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఏడు కొండలను కూడా అమ్మేస్తారు ఎంపీ రాంమోహన్ నాయుడు

ఏడు కొండలను కూడా అమ్మేస్తారు ఎంపీ రాంమోహన్ నాయుడు

విజయవాడ
ఖచ్చితంగా టిడిపి తిరుపతిలో బలపడుతుంది. నారాలోకేష్ ప్రచారానికి మంచి స్పందన వస్తుందని ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు. ఎంపి అనే వ్యక్తి భారత రాజ్యాంగములో కీలకమైన వ్యక్తి. ఎపి రీ అర్గనైజ్ బిల్లులో అనేక అంశాలపై పోరాటం చేసింది. ప్రత్యేక హోదా విషయంలో రాజీలేని పోరాటం చేసామని అయన అన్నారు. నన్ను గెలిపించండి ప్రత్యేక హోదా తెస్తాను అన్న ముఖ్యమంత్రి జగన్ ఇంత వరకు అమాట మాట్లాడలేదు. ప్రత్యేక హోదా అనే మాట మాట్లాడటానికి భయపడుతున్నాడు. 22మంది ఎంపిలు జగన్ కేసుల నుంచి బయటపడటానికి లాబీయింగ్ చేసి చేస్తున్నాడు. విశాఖ ప్రవైటీకరణ పై సైతం టిడిపి నే మాట్లాడిందని అన్నారు.
వైసిపి ఎంపిలు మాట్లాడితే జగన్ ను జైలులో పెడతారనే భయం. ఇంటింటికి జగన్  లేఖలు రాస్తున్నారు. ముఖ్యమంత్రి గారికి చేతగాని తనం వల్ల ప్రభుత్వ అస్తులు అమ్ముకొవాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఇష్టాను సారం స్కీములు ప్రకటించి వాటిని అమలు పర్చడం చేతకాలేక విశాఖలో భూములు అమ్మకానికి పెట్టారు. పరిస్థితి ఇలాగే కొనసాగిస్తే తిరుపతి ఏడు కొండలు కూడా అమ్మి వేస్తాడు..అపరిస్థితి రాకుండా కాపాడాల్సింది తిరుపతి వాసులే. పుదుచ్చేరి కి ప్రత్యేక హోదా ఇస్తామని బిజెపి చెప్పింది. అయితే ఇదెమని అడగకుండా బిజెపికి మద్దతుగా వైకాపా ఎంపిలు ప్రచారం చేసారు. డబ్బుల పంపిణీ,వాలంటీర్ల తో బెదరింపులతో గెలవాలని చూస్తున్నారని అయన అన్నారు.

Related Posts