YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఆర్‌ఎస్‌ఎస్‌చీఫ్‌ మోహన్‌ భగవత్‌కు కరోనా పాజిటివ్‌

ఆర్‌ఎస్‌ఎస్‌చీఫ్‌ మోహన్‌ భగవత్‌కు  కరోనా పాజిటివ్‌

ముంబై  ఏప్రిల్ 10
రాష్ట్ర స్వయం సేవక్‌ సంఘ్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ కరోనా పాజిటివ్‌గా పరీక్ష చేశారు. ఈ మేరకు ఆర్‌ఎస్‌ఎస్‌ ట్వీట్‌ చేసింది. సాధారణ లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయగా.. పాజిటివ్‌గా తేలినట్లు పేర్కింది. దీంతో ఆయన నాగ్‌పూర్‌లోని కింగ్స్‌వే హాస్పిటల్‌లో చేరారు. ఆయనకు సాధారణ పరీక్షలు చేశారని, అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు పేర్కొంది. ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ భగవత్‌ మార్చి 7న కరోనా వ్యాక్సిన్ మొదటి డోస్‌ తీసుకున్నారు. ఇదిలా ఉండగా.. మహారాష్ట్రలో కరోనా విజృంభిస్తోంది. ఈ ఏడాదిలో రికార్డు స్థాయిలో కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు రికార్డవుతున్నాయి. శుక్రవారం రాష్ట్రంలో 58,993 కరోనా కేసులు రికార్డవగా.. 301 మరణాలు నమోదయ్యాయి. రికార్డు స్థాయిలో ముంబైలో 9,200 కేసులు, 35 మరణాలు రికార్డయ్యాయి.

Related Posts